News July 27, 2024
దుండగుల దుశ్చర్య.. ఫ్రాన్స్లో హైస్పీడ్ రైళ్లకు అంతరాయం

పారిస్లో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల నేపథ్యంలో హైస్పీడ్ రైల్ నెట్వర్క్పై దాడి జరగడం సంచలనమైంది. ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు పక్కాప్లాన్తో దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. నగర శివార్లలోని మూడు చోట్ల సిగ్నల్స్, కేబుల్స్ను ధ్వంసం చేశారు. దీంతో ఐరోపా దేశాల నుంచి పారిస్కు వచ్చే రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. దాదాపు 8లక్షల మందికి అంతరాయం కలిగింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


