News December 12, 2024
లవర్స్ మిస్సింగ్!

TG: రాష్ట్రంలో గత ఐదేళ్లలో లక్ష మందికి పైగా అదృశ్యమైతే అందులో సుమారు 60వేల మంది ప్రేమికులే ఉన్నట్లు క్రైం రికార్డులు చెబుతున్నాయి. వీరిలో 17-28 ఏళ్ల మధ్య వయసు వారే అధికంగా ఉన్నారు. 85% మందిని పోలీసులు ట్రేస్ చేసి పట్టుకొని పేరెంట్స్కు అప్పగిస్తున్నారు. ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడం వల్లే వీరు గడప దాటుతున్నట్లు పోలీసుల కౌన్సెలింగ్లో తేలింది. మరోవైపు మిగతా 15% మంది ఆచూకీ మిస్టరీగా మారుతోంది.
Similar News
News December 5, 2025
763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్సైట్: https://www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.


