News September 18, 2024
తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరు: CM చంద్రబాబు

AP: విశాఖ రైల్వే జోన్కు YCP ఐదేళ్ల పాలనలో భూమి ఇవ్వలేదని చంద్రబాబు మండిపడ్డారు. ‘కేంద్ర పథకాలను గత ప్రభుత్వం వినియోగించుకోలేదు. వైసీపీ హయాంలో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారు. తప్పులు చేసిన ఎవరినీ వదిలిపెట్టం. మనం తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థ గడువు ముగిసినా రెన్యువల్ చేయలేదు. అన్న క్యాంటీన్లను రద్దు చేసి జగన్ దుర్మార్గమైన పని చేశాడు’ అని బాబు విమర్శించారు.
Similar News
News October 21, 2025
ప్రపంచ నేతలు.. ఆసక్తికర విషయాలు!

అగ్రదేశాలకు అధినేతలుగా పని చేసిన/చేస్తున్న శక్తిమంతమైన నేతలు వాళ్లు. తమ పాలనతో చెరగని ముద్ర వేశారు. వారి గతంలోని ఆసక్తికర విషయాలు.. *మన్మోహన్ సింగ్-పబ్లిక్ సర్వీసులోకి రాకముందు ప్రొఫెసర్. *ఏంజెలా మెర్కెల్-క్వాంటమ్ కెమిస్ట్రీలో డాక్టరేట్. *జెలెన్స్కీ-కమెడియన్. *విన్స్టన్ చర్చిల్-చిత్రకారుడు. *బైడెన్-లైఫ్గార్డుగా పని చేశారు. *ఒబామా-ఐస్ క్రీమ్ స్కూపర్గా పని చేశారు. పుతిన్-ఇంటెలిజెన్స్ ఆఫీసర్.
News October 21, 2025
వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి

ODI క్రికెట్లో వెస్టిండీస్ అరుదైన రికార్డు సృష్టించింది. ఇవాళ బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచులో మొత్తం 50 ఓవర్లు స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించింది. ఫుల్ మెంబర్ జట్లలో ఇలా ఇన్నింగ్స్ అంతా స్పిన్నర్లే బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి. కాగా ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన BAN 213/7 స్కోర్ చేయగా, అనంతరం విండీస్ కూడా 50 ఓవర్లలో 213/9 స్కోర్ చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో విండీస్ విజయం సాధించింది.
News October 21, 2025
విపక్ష అభ్యర్థులకు NDA బెదిరింపులు: PK

ఓటమి భయంతో NDA కూటమి విపక్ష అభ్యర్థులను బెదిరించి పోటీ నుంచి విత్డ్రా చేయిస్తోందని JSP అధినేత ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఇలాగే వైదొలిగారని చెప్పారు. ‘NDA 400 సీట్లు పైగా గెలుస్తుందని గొప్పలు చెప్పుకొని 240 సీట్లకు పరిమితమైనా BJPకి ఇంకా గుణపాఠం కాలేదు. సూరత్ మోడల్ను అనుసరించాలనుకుంటోంది’ అని విమర్శించారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, EC జోక్యం చేసుకోవాలని కోరారు.