News September 18, 2024
తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరు: CM చంద్రబాబు

AP: విశాఖ రైల్వే జోన్కు YCP ఐదేళ్ల పాలనలో భూమి ఇవ్వలేదని చంద్రబాబు మండిపడ్డారు. ‘కేంద్ర పథకాలను గత ప్రభుత్వం వినియోగించుకోలేదు. వైసీపీ హయాంలో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారు. తప్పులు చేసిన ఎవరినీ వదిలిపెట్టం. మనం తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థ గడువు ముగిసినా రెన్యువల్ చేయలేదు. అన్న క్యాంటీన్లను రద్దు చేసి జగన్ దుర్మార్గమైన పని చేశాడు’ అని బాబు విమర్శించారు.
Similar News
News December 9, 2025
ములుగు: ప్రాణాలు పోతున్నా.. పట్టింపేది!

జిల్లాలో ఇసుక లారీల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది వికలాంగులుగా మారి రోడ్డున పడుతున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్న ఇసుక లారీల నియంత్రణ లేకపోవడం శాపంగా మారిందని జిల్లా వాసులు వాపోతున్నారు. నిత్యం ఇసుక లారీల ప్రమాదాల్లో ప్రాణాలు పోతూనే ఉన్నా లారీల వేగానికి అదుపు లేకుండా పోతుంది. ఇకనైనా ప్రభుత్వం, పాలకులు ఇసుక లారీల నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
News December 9, 2025
విజృంభిస్తున్న భారత బౌలర్లు

సౌతాఫ్రికాతో తొలి టీ20లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. సఫారీ జట్టు టాపార్డర్ను కుప్పకూల్చారు. అర్ష్దీప్ తొలి ఓవర్లోనే ఓపెనర్ డికాక్ను డకౌట్ చేశారు. తర్వాత స్టబ్స్(14)ను వెనక్కి పంపారు. మార్క్రమ్(14)ను అక్షర్ బౌల్డ్ చేయగా, డేవిడ్ మిల్లర్(1)ను పాండ్య పెవిలియన్కు పంపారు. ఫెరీరా(5)ను వరుణ్ ఔట్ చేశారు. దీంతో SA 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
News December 9, 2025
విజృంభిస్తున్న భారత బౌలర్లు

సౌతాఫ్రికాతో తొలి టీ20లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. సఫారీ జట్టు టాపార్డర్ను కుప్పకూల్చారు. అర్ష్దీప్ తొలి ఓవర్లోనే ఓపెనర్ డికాక్ను డకౌట్ చేశారు. తర్వాత స్టబ్స్(14)ను వెనక్కి పంపారు. మార్క్రమ్(14)ను అక్షర్ బౌల్డ్ చేయగా, డేవిడ్ మిల్లర్(1)ను పాండ్య పెవిలియన్కు పంపారు. ఫెరీరా(5)ను వరుణ్ ఔట్ చేశారు. దీంతో SA 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.


