News March 11, 2025
ఇంటర్ క్వశ్చన్ పేపర్లలో మళ్లీ తప్పులు!

TG: ఇవాళ్టి ఇంటర్ ఫస్టియర్ బోటనీ, మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్లలో తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. దీంతో తప్పులు సరిచేసి విద్యార్థులకు తెలపాలని ఇంటర్ బోర్టు ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే సెకండియర్ ఇంగ్లిష్ ప్రశ్నపత్రం ముద్రణలో ఏడో ప్రశ్న అస్పష్టంగా ఉండటంతో, ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన విద్యార్థులకు 4 మార్కులు కలుపుతామని ఇంటర్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News December 31, 2025
జపాన్ను దాటేసి.. 4వ అతిపెద్ద ఎకానమీగా ఇండియా

భారత్ మరో అరుదైన మైలురాయిని అందుకుంది. జపాన్ను వెనక్కినెట్టి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మన ఎకానమీ విలువ 4.18 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. 2030 లోపు జర్మనీని అధిగమించి మూడో స్థానానికి చేరుకుంటామని భారత ప్రభుత్వం ప్రకటించింది. నాలుగేళ్లలో 7.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధిస్తామని తెలిపింది. 2025-26 రెండో క్వార్టర్లో రియల్ GDP 8.2% వృద్ధి చెందిందని వెల్లడించింది.
News December 31, 2025
సన్నీలియోన్ న్యూ ఇయర్ ఈవెంట్ రద్దు.. కారణమిదే!

UPలోని మథురలో జరగాల్సిన సన్నీలియోన్ న్యూ ఇయర్ ఈవెంట్ రద్దయింది. పవిత్రమైన శ్రీకృష్ణుడి జన్మస్థలంలో ఏర్పాటు చేయడంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సన్నీలియోన్తో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్లు పెద్దఎత్తున ప్రచారం చేశారు. టికెట్లూ అమ్మారు. అయితే సాధువులు, మత సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. జిల్లా మేజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఈవెంట్ రద్దయింది.
News December 31, 2025
డిసెంబర్ 31: చరిత్రలో ఈరోజు

✒1600: బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు
✒1928: తెలుగు సినిమా నటుడు, మాజీ MP కొంగర జగ్గయ్య జననం
✒1953: ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి జననం (ఫొటోలో)
✒1965: భారత స్వాతంత్ర్య సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి VP మేనన్ మరణం
✒2020: తెలుగు సినీ నటుడు నర్సింగ్ యాదవ్ మరణం


