News June 21, 2024

బీజేపీలో చేరేందుకు మిథున్ రెడ్డి లాబీయింగ్: ఆదినారాయణ రెడ్డి

image

AP: జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ ఒప్పుకుంటే అవినాశ్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారన్నారు. కానీ వైసీపీ ఎంపీలు అవసరం లేదని బీజేపీ పెద్దలు చెబుతున్నారని పేర్కొన్నారు. అయినా మిథున్ రెడ్డి లాబీయింగ్ చేస్తున్నారని చెప్పారు.

Similar News

News December 20, 2025

ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలివే: ICMR స్టడీ

image

భారత్‌లో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ టాప్ 3లో ఉంది. తాజాగా ICMR చేసిన స్టడీలో లేట్ మ్యారేజ్, 30 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ, 50 దాటాక మెనోపాజ్ వల్ల ఈ క్యాన్సర్ రిస్క్ పెరుగుతున్నట్లు తేలింది. పొట్ట దగ్గర ఫ్యాట్, ఫ్యామిలీ హిస్టరీ, నిద్రలేమి, స్ట్రెస్ వంటి సమస్యలు కూడా ప్రమాదాన్ని పెంచుతున్నాయి. 40 ఏళ్ల నుంచే రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించుకోవాలని స్టడీ సూచించింది.

News December 20, 2025

జూన్‌ కల్లా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తాం: సీఎం

image

AP: జనవరి 26 నాటికి రోడ్లపై చెత్త కనిపించకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జూన్ కల్లా APని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రకటించారు. ప్రజల్లోనూ సామాజిక స్పృహ రావాలని, ఇంట్లోని చెత్తను రోడ్లపై వేయొద్దని సూచించారు. అనకాపల్లి(D) తాళ్లపాలెంలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’లో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో 10L గృహాలు, పట్టణాల్లో 5L ఇళ్లలో కంపోస్టు తయారీ తమ లక్ష్యమన్నారు.

News December 20, 2025

కర్ణాటక CM మార్పు.. సరైన టైంలో హైకమాండ్‌ని కలుస్తామన్న DK

image

కర్ణాటకలో CM మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా Dy CM డీకే శివకుమార్ మాట్లాడుతూ.. పిలుపు వచ్చినపుడు తాను, సీఎం సిద్దరామయ్య హైకమాండ్‌ని కలుస్తామన్నారు. సరైన సమయంలో పిలుస్తామని పార్టీ పెద్దలు చెప్పినట్లు తెలిపారు. పవర్ షేరింగ్ ఒప్పందమేమీ లేదని.. హైకమాండ్ చెప్పే వరకు తానే సీఎం అని సిద్దరామయ్య శుక్రవారం అనడంతో చర్చ మళ్లీ మొదలైంది. ఈ నేపథ్యంలోనే డీకే తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.