News June 21, 2024
బీజేపీలో చేరేందుకు మిథున్ రెడ్డి లాబీయింగ్: ఆదినారాయణ రెడ్డి

AP: జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ ఒప్పుకుంటే అవినాశ్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారన్నారు. కానీ వైసీపీ ఎంపీలు అవసరం లేదని బీజేపీ పెద్దలు చెబుతున్నారని పేర్కొన్నారు. అయినా మిథున్ రెడ్డి లాబీయింగ్ చేస్తున్నారని చెప్పారు.
Similar News
News November 4, 2025
WWC టీమ్ను ప్రకటించిన ఐసీసీ.. కెప్టెన్ ఎవరంటే?

మహిళల ప్రపంచ కప్-2025 టీమ్ ఆఫ్ ది టోర్నీని ICC ప్రకటించింది. విజేతగా నిలిచిన భారత్ నుంచి ముగ్గురికి చోటు దక్కింది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు చొప్పున, పాక్, ఇంగ్లండ్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. టీమ్: స్మృతి మంధాన, లారా(కెప్టెన్), జెమీమా, కాప్, గార్డ్నర్, దీప్తి శర్మ, సదర్లాండ్, డి క్లెర్క్, నవాజ్, అలానా కింగ్, ఎక్లిస్టోన్, బ్రంట్ (12వ ప్లేయర్). మీకు నచ్చిన ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి.
News November 4, 2025
DEC లేదా JANలో భోగాపురం నుంచి టెస్ట్ ఫ్లైట్: రామ్మోహన్

AP: భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు 91.7% పూర్తైనట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. ‘గడువుకు ముందే పనులను పూర్తి చేయాలని నిశ్చయంతో ఉన్నాం. DEC ఆఖరు లేదా JAN తొలి వారంలో టెస్ట్ ఫ్లైట్ ఎగరనుంది. ఏవియేషన్ వర్సిటీ, ఇండిగో హబ్ ఏర్పాటుకు యత్నిస్తున్నాం. భోగాపురంలో స్కిల్ వర్సిటీలు నిర్మిస్తాం’ అని తెలిపారు. అంతకుముందు విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు జీఎంఆర్ ప్రతినిధులు పనుల పురోగతిని వివరించారు.
News November 4, 2025
సైన్యాన్ని కూడా ఆ 10% మందే నియంత్రిస్తున్నారు: రాహుల్

బిహార్ ఎన్నికల ప్రచారంలో CONG నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై దుమారం రేగుతోంది. ‘దేశంలోని 10% జనాభాకే (అగ్రవర్ణాలు) కార్పొరేట్ సెక్టార్, బ్యూరోక్రసీ, జుడీషియరీలో అవకాశాలు దక్కుతున్నాయి. చివరకు ఆర్మీ కూడా వారి కంట్రోల్లోనే ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. 90% ఉన్న SC, ST, BC, మైనారిటీలు కనిపించరని పేర్కొన్నారు. కాగా భారత సైనికుల్ని చైనా సైన్యం కొడుతోందని ఇదివరకు RG కామెంట్ చేయగా SC మందలించింది.


