News March 22, 2025
MLAకి రూ.2 లక్షలు చెల్లించండి: విశాఖ కోర్టు

పలాస MLA గౌతు శిరీషకు రూ.2 లక్షలు చెల్లించాలని విశాఖ జూనియర్ డివిజనల్ అదనపు సివిల్ న్యాయాధికారి తీర్పునిచ్చింది. 2023లో ఆమెపై ఓ పత్రిక అసత్య ఆరోపణలు చేస్తూ వార్త ప్రచురించిందని కోర్టులో కేసు వేశారు. ఈ మేరకు కోర్టు శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. ఆ పత్రిక ఎడిటర్, పబ్లిషర్ జగదీశ్వరరావుకు రూ. 2 లక్షలు జరిమానా విధించింది.
Similar News
News March 22, 2025
విశాఖ: పోలీస్ కమిషనరేట్ పరిధిలో 16 మందికి బదిలీలు

విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 16 మందిని బదిలీ చేస్తూ సీపీ శంకబద్ర బాచి ఆదేశాలు జారీ చేశారు. వీరిలో ముగ్గురు ఏఎస్ఐలతో పాటు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉన్నారన్నారు. భీమిలి ఏఎస్ఐ ఎం సింహాచలంను ఆనందపురానికి, సీఎస్బి నుంచి చంటి కుమారును ఆరిలోవకు, సీఎస్బీ నుంచి శివరామకృష్ణును వన్టౌన్కు బదిలీ చేశారు.
News March 22, 2025
విశాఖ: కారుణ్య నియామక పత్రాలు అందించిన కలెక్టర్

ఏపీఎస్ ఆర్టీసీలో పని చేస్తూ చనిపోయిన ఏడుగురు కుటుంబ సభ్యులకు శనివారం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. కలెక్టర్ కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు వివిధ ప్రభుత్వ శాఖలలో కారుణ్య నియామక పత్రాలు అందించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పని చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశాఖ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు ఉన్నారు.
News March 22, 2025
విశాఖ: కళాకారులకు జిల్లాస్థాయి అవార్డులు

విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో అత్యంత ప్రతిభ కనబరిచిన కళాకారులను ఆదివారం కళా ప్రవీణ 2025 పురస్కారాలతో సత్కరిస్తున్నట్లు సంఘం గౌరవ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కే జనార్ధన్ పేర్కొన్నారు. శనివారం వారు మహారానిపేటలో విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా నుంచి గుర్తింపు పొందిన కళాకారులను ఎంపిక చేసి స్థానిక కళ్యాణ మండపంలో అవార్డులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.