News January 26, 2025
MLA మల్లారెడ్డి పేరు మరిచారు!

ఘట్కేసర్ మున్సిపాలిటీలోని బొక్కోనిగూడ 3వార్డులో బీటి రోడ్డుకు ఈనెల 24న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. శిలాఫలకంలో మాజీ మంత్రి, MLA మల్లారెడ్డి పేరుకు బదులు వెంకట్ నారాయణ రెడ్డి పేరు వేశారు. ఎమ్మెల్యే పేరు మరిచారని, శిలాఫలకంలో పేరు మార్చాలని బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Similar News
News November 22, 2025
సింగరేణి శుభవార్త.. 1,258 మంది ఉద్యోగులు పర్మినెంట్

సింగరేణి సంస్థలో పని చేస్తున్న 1,258 మంది తాత్కాలిక ఉద్యోగులను ఇకనుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. మరో 2 రోజుల్లో వీరికి నియామక పత్రాలను జారీ చేయనున్నట్లు సింగరేణి అధికారులు స్పష్టం చేశారు. కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది. ఈ నిర్ణయంతో ఆయా కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
News November 22, 2025
సింగరేణి శుభవార్త.. 1,258 మంది ఉద్యోగులు పర్మినెంట్

కొత్తగూడెం: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 1,258 మంది తాత్కాలిక ఉద్యోగులను ఇకనుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. మరో 2 రోజుల్లో వీరికి నియామక పత్రాలను జారీ చేయనున్నట్లు సింగరేణి అధికారులు స్పష్టం చేశారు. కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది. ఈ నిర్ణయంతో ఆయా కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
News November 22, 2025
విజయవాడ ఆసుపత్రిలో అరుదైన చికిత్స

విజయవాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ ను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ఏలూరుకు చెందిన యువకుడు తేజ వికాస్ మహిళ గొంతుతో మాట్లాడేవాడు. ఈఎన్టీ వైద్యులు డాక్టర్ రవి రోగిని పరీక్షించి ప్యూబర్ఫోనియా వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. దీని కోసం టైప్-3 థైరొప్లాస్టీ శస్త్రచికిత్స ఉత్తమ మార్గమని నిర్ధారించి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం రోగికి మహిళ వాయిస్ పోయి, పురుషుడు గొంతుతో మాట వస్తోందన్నారు.


