News April 14, 2025
MLA సింప్లిసిటీ.. సెలూన్లో సామాన్యుడిలా క్షవరం!

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంత్ రావు తన సింప్లిసిటీతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు. హైదరాబాద్లో బిచ్కుంద వాసి సురేష్ హెయిర్ సెలూన్కు వెళ్లి సామాన్యుడిలా క్షవరం చేయించుకున్నారు. ఈ సమయంలో ఆయన చుట్టూ ఉన్న వారితో సరదాగా మాట్లాడారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పటికీ, ఆయన ఎంతో నిరాడంబరంగా ఉండటం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన సింప్లిసిటీ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
Similar News
News November 20, 2025
ఓటమి తర్వాత తేజస్వీ యాదవ్ ఫస్ట్ రియాక్షన్

కొత్త ప్రభుత్వం బిహార్ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు RJD నేత తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి తర్వాత తొలిసారి ఆయన స్పందించారు. ‘సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ గారికి, కొత్తగా మంత్రులైన సభ్యులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నూతనంగా ఏర్పడిన ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
News November 20, 2025
బాలలకు విద్యాపరమైన సౌకర్యాలు కల్పించాలి: ఎస్పీ

బాలుర వసతి గృహాల్లో ఉన్న బాలలకు విద్యాపరమైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. బాలల దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని ఏలూరు శనివారపుపేటలో ఉన్న బాలుర వసతి గృహంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. అక్కడ ఉన్న 51 మంది బాలురకు పలు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం వారికి ఎస్పీ బహుమతులను అందజేశారు. వారితో కలిసి ఫోటోలు కూడా దిగారు. ఎస్పీ రాకతో బాలురు సంతోషించారు.
News November 20, 2025
HYD: మెట్రోలో వారి కోసం ప్రత్యేక స్కానింగ్

మెట్రోలో భద్రత మా ప్రాధాన్యం అని HYD మెట్రో తెలిపింది. ప్రతి స్టేషన్లో ఆధునిక సీసీటీవీ నిఘా, కఠిన భద్రతా తనిఖీలు అమలు చేస్తూ ప్రయాణికుల రక్షణను మరింత బలపరుస్తున్నట్లు తెలిపింది. ఫేస్మేకర్లు, గుండె రోగులు, గర్భిణీలకు పూర్తిగా సురక్షితమైన స్కానర్లు ఏర్పాటు చేయడం మెట్రో భద్రతా ప్రమాణాలకు నిదర్శనంగా పేర్కొంది.


