News April 14, 2025
MLA సింప్లిసిటీ.. సెలూన్లో సామాన్యుడిలా క్షవరం!

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంత్ రావు తన సింప్లిసిటీతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు. హైదరాబాద్లో బిచ్కుంద వాసి సురేష్ హెయిర్ సెలూన్కు వెళ్లి సామాన్యుడిలా క్షవరం చేయించుకున్నారు. ఈ సమయంలో ఆయన చుట్టూ ఉన్న వారితో సరదాగా మాట్లాడారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పటికీ, ఆయన ఎంతో నిరాడంబరంగా ఉండటం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన సింప్లిసిటీ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
Similar News
News November 19, 2025
తిరుపతిలో కలపడం మీకు ఇష్టమేనా..?

తిరుపతిని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్గా మార్చడంలో భాగంగా 63 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేయాలని ప్రతిపాదించారు. తిరుపతి రూరల్లో 34 పంచాయతీలు ఉండగా ఇందులో 32 గ్రేటర్లో విలీనానికి విముఖత చూపాయి. సాయినగర్, న్యూ నగర్ పంచాయతీలు విలీనానికి జైకొట్టాయి. పన్నులు భారీగా పెరుగాయని కొందరు ప్రజలు సైతం గ్రేటర్లో కలవడానికి ఆసక్తిచూపడం లేదు. మరి మీరేమంటారు?
News November 19, 2025
SRCL: “CESS”లో విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ సోదాలు

కో- ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ LTD SRCL ఆఫీస్లో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీలు, సెస్ కార్యకలాపాలకు సంబంధించి రికార్డులు తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. CESS కార్యాలయ సిబ్బంది నుంచి పలు రికార్డులు, FILES స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై సమగ్ర విచారణ చేసిన తర్వాత ఉన్నతాధికారులకు REPORT పంపనున్నారు.
News November 19, 2025
MBNR: పవిత్ర పుణ్య క్షేత్రాలకు డీలక్స్ బస్

మహబూబ్ నగర్ నుంచి పవిత్ర పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక డీలక్స్ బస్ నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుజాత ‘Way2News’తో తెలిపారు. ఈనెల ఉదయం 6:00 గంటలకు మహబూబ్ నగర్ నుంచి కొల్లాపూర్ సమీపంలోని పవిత్ర క్షేత్రాలు సోమశిల & సింగోటంకు బస్ వెళ్తుందని, తిరిగి సాయంత్రం 7:00 గంటలకు వస్తుందన్నారు. ఒక్కరికి ఛార్జీ: రూ.500. పూర్తి వివరాలకు 70136 46089, 93989 62021కు సంప్రదించాలని కోరారు.


