News June 7, 2024
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు MLA కీలక నిర్ణయం!

TG: నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ MLA వెడ్మ బొజ్జు పటేల్ సిద్ధమయ్యారు. ‘ఫోన్ఇన్ విత్ యువర్ ఎమ్మెల్యే’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. దీని ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకోవచ్చు. నీటి ఎద్దడి, మురుగు నీటి కాలువలు, రోడ్డు, విద్యుత్, మిషన్ భగీరథ సమస్యల, పోడు భూముల గురించి కాల్స్ వచ్చినట్లు ఆయన Xలో పోస్ట్ చేశారు.
Similar News
News December 3, 2025
నల్గొండ: గ్రామ పంచాయతీలకు ఊరట..!

నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని బకాయిలు వసూళ్లు కావడంతో గ్రామ పంచాయతీలకు ఆదాయం పెరిగింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉండే అభ్యర్థులు ఇంటి పన్ను, నల్లా బకాయిలు చెల్లించి నామినేషన్ ఫారంకు రశీదు జతచేయాలని నిబంధన ఉండడం పంచాయతీలకు వరంగా మారింది. బకాయి బిల్లులు వసూలు కావడంతో పంచాయతీలకు కొంత ఊరట లభించింది. జిల్లా వ్యాప్తంగా 869 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
News December 3, 2025
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <
News December 3, 2025
పిల్లల్లో పోషకాహార లోపం రాకుండా ఉండాలంటే?

పసిపిల్లలు ఆరోగ్యంగా ఉంటూ, ఎత్తుకు తగ్గ బరువు పెరగాలంటే పోషకాహారం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మొదటి ఆరునెలలు తల్లిపాలు, తర్వాత రెండేళ్ల వరకు ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్తో కూడిని పోషకాహారం అందిస్తే ఇమ్యునిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అయోడిన్, ఐరన్ లోపం రాకుండా చూసుకోవాలంటున్నారు. వీటితో పాటు సమయానుసారం టీకాలు వేయించడం తప్పనిసరి.


