News June 7, 2024
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు MLA కీలక నిర్ణయం!

TG: నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ MLA వెడ్మ బొజ్జు పటేల్ సిద్ధమయ్యారు. ‘ఫోన్ఇన్ విత్ యువర్ ఎమ్మెల్యే’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. దీని ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకోవచ్చు. నీటి ఎద్దడి, మురుగు నీటి కాలువలు, రోడ్డు, విద్యుత్, మిషన్ భగీరథ సమస్యల, పోడు భూముల గురించి కాల్స్ వచ్చినట్లు ఆయన Xలో పోస్ట్ చేశారు.
Similar News
News December 11, 2025
IAF సాహసోపేతమైన మిషన్కు 54 ఏళ్లు

1971 ఇండో-పాక్ యుద్ధంలో IAF చేపట్టిన మొట్టమొదటి సాహసోపేతమైన టాంగైల్ వైమానిక దాడికి నేటితో 54 ఏళ్లు. ఢాకా వైపు వెళ్తోన్న పాక్ సైన్యాన్ని అడ్డుకుని మన ఆర్మీకి రూట్ క్లియర్ చేయడానికి ఈ ఆపరేషన్ చేపట్టింది. An-12s, పాకెట్స్, Dakota విమానాల ద్వారా 750 మంది సైనికులను పట్టపగలే పారాడ్రాప్ చేసింది. కీలకమైన పూంగ్లీ వంతెనను స్వాధీనం చేసుకుని పాక్ ఆర్మీని తరిమికొట్టింది. దీంతో బంగ్లాదేశ్ విమోచన సాధ్యమైంది.
News December 11, 2025
కారు ఢీకొని నటి వెన్నె డేవిస్ మృతి

హాలీవుడ్ నటి వెన్నె డేవిస్(60) రోడ్డు ప్రమాదంలో మరణించారు. న్యూయార్క్లోని మిడ్టౌన్ మాన్హట్టన్లో నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను ఓ కారు ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ది మార్వెలెస్ మిసెస్ మైసెల్, న్యూ ఆమ్స్టర్డ్యామ్, బ్లైండ్స్పాట్, షేమ్ వంటి సిరీస్లతో ఆమె పాపులర్ అయ్యారు. డిటెక్టివ్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించి మెప్పించారు.
News December 11, 2025
డోలా, నిమ్మల, ఫరూక్ ఫస్ట్.. కొల్లు, మండిపల్లి లాస్ట్

AP: ఈ-ఆఫీస్ ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రుల పనితీరుపై ఐటీ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇందులో డోలా వీరాంజనేయస్వామి, నిమ్మల రామానాయుడు, ఫరూక్ టాప్లో ఉన్నారు. వారు ఒక్కో ఫైల్ను సగటున 2 రోజుల్లోనే పరిష్కరిస్తున్నారు. CM CBN, మంత్రి లోకేశ్ 3, Dy.CM పవన్ 4 రోజుల్లో క్లియర్ చేస్తున్నారు. ఒక్కో ఫైల్కు 15 రోజుల గడువు తీసుకుంటూ మంత్రులు కొల్లు రవీంద్ర, రాంప్రసాద్రెడ్డి చివరి స్థానాల్లో ఉన్నారు.


