News April 13, 2024
ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారు: సిద్ద రామయ్య

కర్ణాటక సీఎం సిద్ద రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని అన్నారు. MLAలకు రూ.50 కోట్లు ఆఫర్ చేసిందని ఆరోపించారు. అయితే ఈ ప్రక్రియలో బీజేపీ విఫలమైందని తెలిపారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ను వీడేందుకు సిద్ధంగా లేరని చెప్పారు.
Similar News
News March 6, 2026
ఇతనికి 60 ఏళ్లు.. నమ్ముతారా?

తన ఏజ్లెస్ లుక్స్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సింగపూర్ మోడల్ చువాండో టాన్ ఈ నెల 3న 60 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అరవైలో ఇరవైలా ఉండటమంటే ఇదేనని, ఇతను వ్యాంపైర్ అయి ఉంటాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హై ప్రొటీన్ ఫుడ్, మద్యం, ధూమపానం, చక్కెరకు దూరంగా ఉండటం, డైలీ వ్యాయామం, స్విమ్మింగ్ తన ఫిట్నెస్కు కారణమని అతను చెబుతుంటారు.
News March 6, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 6)

* 1899: తెలుగు రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు తల్లాప్రగడ విశ్వసుందరమ్మ జననం
* 1913: తొలితరం హాస్యనటుడు కస్తూరి శివరావు జననం
* 1917: సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు జననం
* 1919: సాహితీవేత్త గడియారం రామకృష్ణ శర్మ జననం
* 1933: సినీ నటి కృష్ణకుమారి జననం (ఫొటోలో)
* 1964: పిఠాపురం చివరి రాజు మహీపతి సూర్యారావు మరణం
* 2016: నటుడు కళాభవన్ మణి మరణం
News March 6, 2026
‘ఆశా’లకు కొత్త ఫోన్లు, 2 చీరలు: సత్యకుమార్

AP: ఆశావర్కర్లకు GOVT గుడ్ న్యూస్ చెప్పింది. వారికి కొత్త ఫోన్లు, 2 కొత్త చీరలు ఇస్తామని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. NHM ప్రకారం ఇతర ఉద్యోగుల మాదిరే సెలవులు ఇస్తామన్నారు. దహన సంస్కారాలకు ₹15,000 ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 1,363 ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. బీమా సౌకర్యం వర్తింపునకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామన్నారు. ఆశా వర్కర్స్ యూనియన్ ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు.


