News August 17, 2024

MLCగా బొత్సకు మూడేళ్లే అవకాశం..!

image

ఎమ్మెల్సీ పదవీ కాలం ఆరేళ్లు ఉంటుంది. కానీ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ మూడేళ్ల తర్వాత మాజీ అవుతారు. దీనికి ప్రధాన కారణం ఉపఎన్నిక. వైసీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణ జనసేనలో చేరడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. ఈక్రమంలోనే ఉపఎన్నిక వచ్చింది. నిబంధనల ప్రకారం ముందుగా ఎన్నికైన వ్యక్తి ఆరేళ్లలో ఎన్నిరోజులు పదవిలో ఉంటారో అవి మినహాయించి కొత్త వ్యక్తి పదవీకాలం ఉంటుంది.

Similar News

News October 16, 2025

VZM: ఆర్టీసీ సేవల్లో సమస్యలపై తెలయజేయండి

image

ఆర్టీసీ సేవల్లో సమస్యల తెలుసుకునేందుకు నేడు డయల్ యువర్ డీపీటీఓ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజారవాణాధికారిణి జి.వరలక్ష్మి తెలిపారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఫిర్యాదు స్వీకరించనున్నారు. విజయనగరం జిల్లా పరిధిలో గల ప్రయాణికులు, తమ సలహాలు, సూచనలు, సమస్యలపై 99592 25604 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.

News October 16, 2025

VZM: రైలులో గంజాయితో ఇద్దరు అరెస్టు

image

ఒడిశాలోని మునిగుడ నుంచి కేరళ తరలిస్తున్న మూడు కిలోల గంజాయి పట్టుకున్నట్ల రైల్వే ఎస్ఐ బాలాజీరావు చెప్పారు. పార్వతీపురం రైల్వే స్టేషన్ నుంచి విజయనగరం రైల్వే స్టేషన్ మధ్యలో ఏర్నాకులం రైలులో తనిఖీలు చేస్తుండగా కేరళకు చెందిన సుని, గోవిందరాజు నుంచి మూడు కిలోల గంజాయి సీజ్ చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు. గంజాయి నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రైల్వే పోలీసులు చెప్పారు.

News October 15, 2025

విజయనగరం జిల్లా రైతులకు విజ్ఞప్తి

image

పత్తి, మొక్కజొన్న పంటలకు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు విక్రయించవద్దని జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి రవికిరణ్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంవత్సరానికి పత్తి ధర క్వింటాల్‌కు రూ.8110, మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.2400గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అక్టోబరు 21 తర్వాత జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.