News February 11, 2025
MLC ఎన్నికలకు 59 మంది నామినేషన్ల దాఖలు

ఉభయగోదావరి జిల్లాలో MLC ఎన్నికలు ఈనెల 27న జరగనున్నాయి. కాగా సోమవారం 59 మంది అభ్యర్థులు 72 సెట్ల నామినేషన్లు వేశారు. ఈనెల 11న ( నేడు)నామినేషన్ పత్రాల పరిశీలన చేయనున్నారు. 13న సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.
Similar News
News November 26, 2025
ఏకగ్రీవాల కోసం సంప్రదింపులు.. గ్రామాల్లో ఎలక్షన్ HEAT

గ్రామపంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో వివిధ పార్టీల నాయకులు ఏకగ్రీవాల కోసం సంప్రదింపులు ప్రారంభించారు. తమ మద్దతుదారులను సర్పంచులుగా గెలిపించుకునేందుకు రంగంలోకి దిగారు. ప్రజలతో సత్సంబంధాలు ఉండి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్న అభ్యర్థులతో రాజీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు కేంద్రమంత్రి బండి సంజయ్ తమ పార్టీ మద్దతుదారులను ఏకగ్రీవం చేస్తే రూ.10 లక్షల ప్రోత్సాహకం ప్రకటించిన విషయం తెలిసిందే.
News November 26, 2025
ఏకగ్రీవాల కోసం సంప్రదింపులు.. గ్రామాల్లో ఎలక్షన్ HEAT

గ్రామపంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో వివిధ పార్టీల నాయకులు ఏకగ్రీవాల కోసం సంప్రదింపులు ప్రారంభించారు. తమ మద్దతుదారులను సర్పంచులుగా గెలిపించుకునేందుకు రంగంలోకి దిగారు. ప్రజలతో సత్సంబంధాలు ఉండి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్న అభ్యర్థులతో రాజీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు కేంద్రమంత్రి బండి సంజయ్ తమ పార్టీ మద్దతుదారులను ఏకగ్రీవం చేస్తే రూ.10 లక్షల ప్రోత్సాహకం ప్రకటించిన విషయం తెలిసిందే.
News November 26, 2025
బూర్గంపాడు: అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్య

రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించిన అథ్లెట్, అంగన్వాడీ కార్యకర్త బింగి కృష్ణవేణి(42) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడింది. బూర్గంపాడు మండలం కోయగూడెం గ్రామానికి చెందిన ఆమె.. ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో గొడవల కారణంగా మనస్తాపానికి గురై సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేశారు.


