News February 22, 2025

MLC ఎన్నికల్లో విజయం బీజేపీదే: బండి సంజయ్

image

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిలో పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం శనివారం నిర్వహించారు. కమిట్‌మెంట్‌తో పని చేస్తే పార్టీ క్యాడర్ బీజేపీకే సొంతం అవుతుందని ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు. ముఖ్యంగా 317 జీవోకు వ్యతిరేకంగా టీచర్ల సమస్యలపై మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని తెలిపారు.

Similar News

News March 27, 2025

బాపట్ల జిల్లా TODAY TOP NEWS

image

◆బాపట్ల జిల్లాలో యువ రైతు ఆత్మహత్య
◆రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారు: MLA నరేంద్ర
◆ప్రజల్ని మభ్యపెడుతున్న కూటమి: వరికూటి అశోక్
◆పర్చూరు: సులువు కానున్న తెలంగాణ- ఆంధ్ర రవాణా
◆మార్టూరు: ‘మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఎక్కడ’
◆చివరి ఎకరా వరకు నీరు అందాలి: MLA నక్కా
◆బల్లికురవ: ‘వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి’
◆బాపట్ల మెడికల్ కాలేజీ నిర్మాణంలో నిర్లక్ష్యం: కోన

News March 27, 2025

విశాఖలో లులూ మాల్.. భూమి కేటాయింపు

image

AP: విశాఖపట్నంలో లులూ గ్రూప్ నిర్మించబోయే షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కులో 13.43 ఎకరాలను APIICకి బదలాయించాలని VMRDAకు ఆదేశాలు జారీ చేసింది. 2017లోనే లులూకు భూమి కేటాయించగా 2023లో గత ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ భూకేటాయింపులు చేయాలని APIICని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఆదేశించారు.

News March 27, 2025

నెలన్నరలో 325 మంది మావోలు హతం: ఛత్తీస్‌గఢ్‌‌ సీఎం

image

ఛత్తీస్‌గఢ్‌‌లో నెలన్నరలో 325 మంది మావోయిస్టులు హతమైనట్లు ఆ రాష్ట్ర CM విష్ణుదేవ్ సాయ్ ప్రకటించారు. మరో 2 వేల మంది అరెస్టు లేదా లొంగిపోయినట్లు వెల్లడించారు. రాష్ట్రం మొత్తం మావోయిస్టుల ప్రభావం ఉందన్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. బస్తర్ ప్రాంతం మినహా ఎక్కడా నక్సల్స్ లేరని స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్రంలో ఎక్కడా వారి జాడ లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టినట్లు CM తెలిపారు.

error: Content is protected !!