News March 4, 2025

MLC ఎన్నికలు.. అప్పుడు PRTU.. ఇప్పుడు BJP

image

టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య మొదటి ప్రాధాన్యం ఓట్లతో గెలుపొందారు. మొత్తం 27,088 ఓట్లకు గాను 25,041 ఓట్లు పోలు కాగా.. 24,144 చెల్లుబాటు అయ్యాయి. దీంతో గెలుపు కోటా ఓట్లు 12,073గా నిర్ధారించారు. మల్క కొమురయ్య 12,959, వంగ మహేందర్‌రెడ్డి 7,182, అశోక్‌కుమార్‌ 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. గతంలో PRTU బలపరిచిన రఘోత్తంరెడ్డి విజయం సాధించగా, ఈసారి బీజేపీ గెలిచింది.

Similar News

News March 4, 2025

రోహిత్ ఈ సారైనా టాస్ గెలువు: ఆకాశ్ చోప్రా

image

రోహిత్‌శర్మ ఈసారైనా టాస్ గెలవాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కోరారు. ఆసీస్‌తో మ్యాచ్‌‌లో టాస్ పాత్ర కీలకం కానుందని తన యూట్యూబ్ ఛానల్‌లో తెలిపారు. ఈ పిచ్‌లపై ఛేజింగ్ చాలా కష్టమని, సెమీస్‌లో టాస్‌ గెలవటం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఇప్పటివరకూ టాస్ ఓడినప్పటికీ మ్యాచులలో గెలిచింది. అయితే రోహిత్ శర్మ వరుసగా 10సార్లు టాస్ ఓడి రికార్డు సృష్టించారు.

News March 4, 2025

దిశvsశక్తి.. మండలిలో వాడీవేడీ చర్చ

image

AP: గత ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌ను తొలగించడంపై మండలిలో YCP MLC వరుదు కళ్యాణి మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరవైందని దుయ్యబట్టారు. ఆమె వ్యాఖ్యలకు మంత్రులు సవిత, అనిత కౌంటరిచ్చారు. చట్టబద్ధత లేని దిశ గురించి ఆమె మాట్లాడుతున్నారని, ఆ యాప్‌తో ఎంతమంది మహిళలను రక్షించారని ప్రశ్నించారు. తాము నెట్‌వర్క్ లేని చోట కూడా పనిచేసేలా శక్తి యాప్‌ను మహిళా దినోత్సవం రోజున ప్రారంభిస్తామని తెలిపారు.

News March 4, 2025

ఇల్లంతకుంట: టిప్పర్ పైనుంచి పోవడంతో వ్యక్తి మృతి

image

టిప్పర్ పైనుంచి పోవడంతో వ్యక్తి నుజ్జు నుజ్జైన ఘటన ఇల్లంతకుంట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం… అనంతారంలో బైక్ పై వెళుతున్న వ్యక్తిని టిప్పర్ ఢీ కొట్టి అతడి పైనుంచి వెళ్లడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!