News June 5, 2024
MLC ఉప ఎన్నిక కౌంటింగ్.. వారిద్దరి మధ్యే పోటీ!

TG: నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ MLC ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఇప్పటివరకు 4 రౌండ్లు పూర్తికాగా, మొత్తం 96వేల ఓట్లను లెక్కించారు. తీన్మార్ మల్లన్న(కాంగ్రెస్), రాకేశ్ రెడ్డి(బీఆర్ఎస్) మధ్య పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. చెల్లని ఓట్లు భారీగా నమోదవుతున్నట్లు సమాచారం. 4 హాళ్లు, 96 టేబుళ్లపై కౌంటింగ్ కొనసాగుతోంది.
Similar News
News December 31, 2025
పశువుల్లో పొదుగువాపు వ్యాధి లక్షణాలు

పాడి పశువులకు సోకే వ్యాధుల్లో పొదుగువాపు వ్యాధి చాలా ప్రమాదకరమైనది. పశువుల షెడ్లోని అపరిశుభ్ర వాతావరణం, యాజమాన్య లోపాల వల్ల పాలిచ్చే పశువులకు ఇది సోకే అవకాశం ఎక్కువ. పొదుగు వాచిపోవడం, పాలు నీరులా మారడం, విరగడం, అందులో తెల్లటి ముక్కలు కనిపించడం, పశువులు పాలు పిండనీయకపోవడం వంటి లక్షణాలను బట్టి పశువుల్లో ఈ వ్యాధిని గుర్తించవచ్చు. పొదుగువాపు వల్ల పాల ఉత్పత్తి బాగా తగ్గుతుంది.
News December 31, 2025
స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు

TG: SC విద్యార్థులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఇవాళ్టితో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గడువు ముగియనుంది. దానిని MAR31 వరకు పొడిగించింది. ఈ విషయాన్ని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి ఉపసంచాలకులు ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్, ఆపై చదువులు చదువుతున్న అర్హులైన SC విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి రెన్యువల్/ఫ్రెష్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News December 31, 2025
ట్రంప్, చైనా కామెంట్స్పై మోదీ స్పందించాలి: కాంగ్రెస్

ఇండియా-పాక్ మధ్య శాంతి కోసం మధ్యవర్తిత్వం చేశామని <<18718800>>చైనా చేసిన<<>> కామెంట్లపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ‘తానే యుద్ధాన్ని ఆపినట్టు పలు వేదికల్లో US అధ్యక్షుడు ట్రంప్ చాలాసార్లు చెప్పారు. తామే మధ్యవర్తిత్వం వహించామని ఇప్పుడు చైనా ఫారిన్ మినిస్టర్ చెబుతున్నారు. వాళ్లు చేస్తున్న కామెంట్లు మన దేశ భద్రతను అపహాస్యం చేస్తున్నట్టు ఉన్నాయి’ అని చెప్పారు.


