News June 5, 2024
ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్

TG: ఇవాళ WGL-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల MLC ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. మే 27న జరిగిన పోలింగ్లో 72.44 శాతం ఓటింగ్ నమోదైంది. నల్గొండ(D) సమీపంలోని దుప్పలపల్లిలో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రేపటి వరకు కొనసాగే అవకాశం ఉంది. 3,36,013 బ్యాలెట్ ఓట్ల లెక్కింపును మొత్తం 96 టేబుళ్లపై చేపట్టనున్నారు. తీన్మార్ మల్లన్న(CONG), రాకేశ్ (BRS), అశోక్(స్వతంత్ర) ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు.
Similar News
News November 20, 2025
ఇండియాకు 100 US జావెలిన్ మిస్సైళ్లు

దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. $92.8M విలువైన 100 FGM-148 జావెలిన్ క్షిపణులను, ఎక్స్కాలిబర్ ప్రొజెక్టైల్స్ అమ్మకానికి US ఆమోదం తెలిపింది. ముప్పులను సమర్థంగా ఎదుర్కొనేలా భారత రక్షణ రంగం పటిష్ఠం అవుతుందని US డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ వివరించింది. మిస్సైల్స్తో పాటు లాంచర్ యూనిట్లు, ఫిరంగి గుండ్లు అందుతాయి. మిస్సైల్ను భుజంపై మోస్తూ ఇద్దరు ఆపరేట్ చేయొచ్చు.
News November 20, 2025
ఎక్స్ట్రీమ్ వెదర్తో 4,064 మంది మృతి

దేశంలో ప్రకృతి వైపరీత్యాలతో ఈ ఏడాది JAN-SEP వరకు 4,064 మంది మృత్యువాత పడినట్లు ఢిల్లీకి చెందిన ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ & ‘డౌన్ టు ఎర్త్’ నివేదిక వెల్లడించింది. గత 4 ఏళ్లతో పోలిస్తే మరణాలు 48% పెరిగినట్లు పేర్కొంది. 9.47 M హెక్టార్ల పంట నష్టం వాటిల్లింది. 2022తో పోలిస్తే 4 రెట్లు పెరిగింది. వ్యవసాయ రాష్ట్రాలైన AP, WBల సమాచారం అసమగ్రంగా ఉందని, నష్టం ఇంకా ఎక్కువే ఉండొచ్చంది.
News November 20, 2025
ఇజ్రాయెల్ దాడిలో 27 మంది మృతి

ఇజ్రాయెల్-హమాస్ మధ్య పదే పదే సీజ్ ఫైర్ ఉల్లంఘన జరుగుతోంది. నిన్న ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 27 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. గాజాలో 14 మంది, ఖాన్ యూనిస్ ఏరియాలో 13 మంది మరణించినట్లు వెల్లడించారు. హమాస్ సీజ్ ఫైర్ ఉల్లంఘనకు పాల్పడటంతోనే దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. పరిస్థితులు మెరుగవుతున్న సమయంలో మరోసారి దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయని గాజా స్థానికులు చెబుతున్నారు.


