News May 2, 2024

నేడు ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్

image

TG: నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నిర్వహణకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వరరావు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. కాగా ఈ ఉపఎన్నికకు నేటి నుంచి ఈ నెల 9వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 27న పోలింగ్, జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఈసీ షెడ్యూల్‌లో పేర్కొంది.

Similar News

News March 14, 2026

దేవాన్ష్ ధోతీ ఫంక్షన్‌లో నారా, నందమూరి ఫ్యామిలీ

image

AP: సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ ధోతీ వేడుక ఇవాళ HYDలో జరిగింది. ఈ కార్యక్రమంలో నారా, నందమూరి ఫ్యామిలీ సందడి చేసింది. అమ్మమ్మ వారి తరఫున నందమూరి బాలకృష్ణ దంపతులు దేవాన్ష్‌తో పాటు లోకేశ్, బ్రాహ్మణికి నూతన వస్త్రాలు పెట్టారు. అనంతరం అందరూ కలిసి ఫొటోలు దిగారు. వీటిని లోకేశ్ Xలో షేర్ చేశారు. దేవాన్ష్ ఎదుగుదల చూసి తామందరికీ ఎంతో ఆనందంగా ఉందన్నారు.

News March 14, 2026

రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి: KTR

image

TG: మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు రెండేళ్లు తమ ఆస్తులు కాపాడుకోవాలని, తర్వాత తమ ప్రభుత్వమే వస్తుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. BRS హయాంలో చేపట్టిన మూసీ అభివృద్ధిపై HYD హిమాయత్ సాగర్‌ వద్ద ఆయన PPT ఇచ్చారు. రానున్న రెండేళ్లు కాంగ్రెస్ బుల్డోజర్ ప్రభుత్వంపై పోరాటానికి మూసీ బాధితులంతా తమకు అండగా ఉండాలని కోరారు. HYDలో మూసీని మురికికూపంగా మార్చిందే కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.

News March 14, 2026

భట్టి ఇంటికి సీఎం చంద్రబాబు

image

ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లారు. ఇటీవల భట్టి కుమారుడి వివాహం జరగగా బిజీ షెడ్యూల్ వల్ల చంద్రబాబు హాజరు కాలేకపోయారు. దీంతో ఇవాళ హైదరాబాద్‌లోని ఆయన నివాసం ప్రజాభవన్‌కు వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం చంద్రబాబు అల్లు అరవింద్ నివాసానికి చేరుకొని శిరీష్-నయనిక దంపతులకు విషెస్ తెలిపారు. ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.