News May 27, 2024
నేడే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

TG: ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల MLC ఉప ఎన్నిక నేడు జరగనుంది. 34 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4.63 లక్షలమంది గ్రాడ్యుయేట్లు ఓటు వేయనున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి 52మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, BRS నుంచి రాకేశ్ రెడ్డి, BJP అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీలో చేస్తున్నారు.
Similar News
News November 18, 2025
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో బదిలీలు.. అర్హులు ఎవరంటే?

* భార్యాభర్తల్లో ఎవరైనా ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, వర్సిటీల్లో పనిచేస్తూ ఉండాలి.
* ఒకరు ప్రభుత్వ, మరొకరు ప్రైవేట్ ఉద్యోగి అయితే <<18315066>>బదిలీ<<>> వర్తించదు.
* మ్యారేజ్ సర్టిఫికెట్, ఎంప్లాయిమెంట్ ఐడీ కార్డు తప్పనిసరి.
* ప్రభుత్వానికి బకాయిలు లేనట్లు ధ్రువీకరణపత్రం ఉండాలి.
* మెరిట్ ర్యాంకు ఆధారంగా బదిలీ చేస్తారు. ఒకవేళ టై అయితే సీనియారిటీ, DOB ఆధారంగా ప్రాధాన్యత ఇస్తారు.
News November 18, 2025
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో బదిలీలు.. అర్హులు ఎవరంటే?

* భార్యాభర్తల్లో ఎవరైనా ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, వర్సిటీల్లో పనిచేస్తూ ఉండాలి.
* ఒకరు ప్రభుత్వ, మరొకరు ప్రైవేట్ ఉద్యోగి అయితే <<18315066>>బదిలీ<<>> వర్తించదు.
* మ్యారేజ్ సర్టిఫికెట్, ఎంప్లాయిమెంట్ ఐడీ కార్డు తప్పనిసరి.
* ప్రభుత్వానికి బకాయిలు లేనట్లు ధ్రువీకరణపత్రం ఉండాలి.
* మెరిట్ ర్యాంకు ఆధారంగా బదిలీ చేస్తారు. ఒకవేళ టై అయితే సీనియారిటీ, DOB ఆధారంగా ప్రాధాన్యత ఇస్తారు.
News November 18, 2025
‘ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత’ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండకూడదన్న <<18069484>>నిబంధనను <<>>ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసింది. ఈ రూల్ను తొలగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా సర్పంచ్, వార్డ్ మెంబర్, MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. 1994లో ఉమ్మడి APలో జనాభా నియంత్రణ లక్ష్యంగా ఈ నిబంధన తీసుకొచ్చారు.


