News March 4, 2025

ఎమ్మెల్సీ కౌంటింగ్: రసవత్తర పోటీ

image

TG: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 6712, నరేందర్ రెడ్డి (కాంగ్రెస్) 6676, ప్రసన్న హరికృష్ణ 5867, రవీందర్ సింగ్‌ 107, మహమ్మద్ ముస్తాక్ అలీకి 156 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెండో రౌండ్ లెక్కింపు ప్రారంభమైందన్నారు.

Similar News

News March 4, 2025

ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు

image

TG: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. కార్డు నమూనాను సీఎం రేవంత్ ఫైనల్ చేశారు. లేత నీలి రంగులోని కార్డుపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఫొటోలు ఉంటాయి.

News March 4, 2025

‘ఆస్కార్’ చిత్రాలు ఏ OTTలో ఉన్నాయంటే?

image

✒ అనోరా- జీ5, జియో హాట్ స్టార్(మార్చి 17 నుంచి)
✒ ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా- నెట్‌ఫ్లిక్స్
✒ డ్యూన్:2 జియో హాట్‌స్టార్
✒ ది సబ్‌స్టాన్స్- అమెజాన్ ప్రైమ్(రెంట్), MUBI
✒ ది బ్రూటలిస్ట్- యాపిల్ టీవీ(రెంట్)
✒ ఎమిలియా పెరెజ్- MUBI, ప్రైమ్(రెంట్)
✒ విక్‌డ్- ప్రైమ్(రెంట్), హాట్‌స్టార్(మార్చి 22 నుంచి)

News March 4, 2025

శాసనసభ సభ్యులకు క్రీడా పోటీలు

image

AP: శాసనసభ సభ్యులకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పురుషులకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ.. మహిళలకు బ్యాడ్మింటన్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించనున్నారు. చీఫ్ విప్‌లు, విప్‌లకు పేర్లు ఇవ్వాలని స్పీకర్ అయ్యన్న సభలో ప్రకటించారు. ఈ నెల 18,19,20 తేదీల్లో నిర్వహించే పోటీలకు IASలు, హైకోర్టు జడ్జిలను ఆహ్వానించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

error: Content is protected !!