News March 12, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం!

image

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తవ్వగా తెలంగాణ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ బరిలో ఉన్నారు. ఇక ఏపీ నుంచి బీటీ నాయుడు, గ్రీష్మ, బీదా రవిచంద్ర, సోము వీర్రాజు, నాగబాబు నామినేషన్లు వేశారు. రేపటితో నామినేషన్ల ఉపసంహరణ ముగియనుండగా అదే రోజు సాయంత్రం ఈసీ ప్రకటన చేయనుంది.

Similar News

News March 12, 2025

RECORD: కోహ్లీని దాటేసిన హార్దిక్ పాండ్య

image

భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ రికార్డును దాటేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత కప్‌తో దిగిన ఫొటోను పాండ్య పోస్ట్ చేయగా 6 నిమిషాల్లోనే మిలియన్ లైక్స్ సాధించింది. గతంలో కోహ్లీ పెట్టిన ఓ పోస్టుకు 7నిమిషాల్లో మిలియన్ లైకులు రాగా, తాజాగా హార్దిక్ ఫొటో దాన్ని దాటేసింది. CT గెలిచిన తర్వాత కప్‌ను పిచ్‌పై ఉంచి కాబీ‌లేమ్ స్టైల్లో దిగిన ఫొటో వైరల్ అయిన విషయం తెలిసిందే.

News March 12, 2025

ఈనెల 19న తెలంగాణ బడ్జెట్

image

TG: ఈనెల 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈనెల 19న ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మరోవైపు ఎమ్మెల్యేలకు పని విభజన చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఇరిగేషన్, వ్యవసాయం, రెవెన్యూ, పవర్, వైద్యంతో పాటు పలు అంశాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. సంబంధిత శాఖ మంత్రులతో కో ఆర్డినేట్ చేసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు.

News March 12, 2025

కట్టెల పొయ్యితో మా అమ్మ పడిన కష్టాలు తెలుసు: చంద్రబాబు

image

AP: ఆడబిడ్డలు సైకిళ్లు తొక్కలేరనే భావన చెరిపేసేందుకు గతంలో విద్యార్థినులకు సైకిళ్లు ఇచ్చినట్లు CM చంద్రబాబు అన్నారు. ‘మగవాళ్ల కంటే ఆడవాళ్లు తెలివైనవాళ్లు. RTCలో మహిళా కండక్టర్లు బాగా రాణిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆస్తులను మహిళల పేరుతోనే ఇస్తున్నాం. కట్టెల పొయ్యి వద్ద మా అమ్మ పడిన కష్టాలు నాకు తెలుసు. ఆ కష్టాలు తీరుస్తూ దీపం పథకం కింద 65లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం’ అని అసెంబ్లీలో అన్నారు.

error: Content is protected !!