News February 27, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటుకు రూ.5వేలు?

image

TG: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నిన్న ఓటర్లకు పలువురు అభ్యర్థులు డబ్బులు పంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇచ్చినట్లు సమాచారం. కొందరు ఓటర్లకు పార్టీలు కూడా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండడంపై నిఘా ఉందన్న ప్రచారంతో నేరుగా ఓటర్ల చేతికే డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. తమకు డబ్బులు రాలేవని కొందరు నిరాశ చెందుతుండటం గమనార్హం.

Similar News

News January 26, 2026

నలుగురు మంత్రుల అత్యవసర భేటీ?

image

TG: ఓవైపు సీఎం రేవంత్ అమెరికాలో ఉండటం, మరోవైపు సింగరేణిపై రచ్చ కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసం ప్రజాభవన్‌లో నలుగురు మంత్రులు అత్యవసరంగా సమావేశమైనట్లు సమాచారం. లోక్‌భవన్‌లో ఎట్ హోం ముగిశాక భట్టి, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌, అడ్లూరి ఒకే కారులో ప్రజాభవన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ అంశం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

News January 26, 2026

రేపు అఖిలపక్ష భేటీ

image

ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష భేటీ నిర్వహిస్తోంది. పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆహ్వానం పంపారు. పార్లమెంట్ సమావేశాల్లో సహకరించాలని కేంద్రం కోరనుంది. అలాగే ప్రవేశపెట్టే బిల్లుల వివరాలను విపక్షాలకు ఇవ్వనుంది. కాగా ఈ నెల 28 నుంచి FEB 13 వరకు, MAR 9 నుంచి APR 2 వరకు రెండు విడతల్లో సమావేశాలు జరగనున్నాయి.

News January 26, 2026

5 సెకన్లలో 10 బుల్లెట్లు.. USను కుదిపేస్తున్న అలెక్స్ మరణం!

image

USలో ఫెడరల్ ఏజెంట్ల కాల్పుల్లో అలెక్స్ ప్రెట్టీ అనే వ్యక్తి మరణించడం దుమారం రేపుతోంది. ఇమిగ్రేషన్ అధికారుల దౌర్జన్యాన్ని ఫోన్‌లో రికార్డ్ చేస్తున్నందుకే అతడిపై 5 సెకన్లలో 10 బుల్లెట్లు పేల్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. అతడి వద్ద గన్ ఉందని అధికారులు వాదిస్తున్నా వీడియోల్లో మాత్రం ఫోన్ మాత్రమే కనిపిస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ట్రంప్ హయాంలోని ఏజెంట్ల దాష్టీకాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.