News September 15, 2024

MLC ఎలక్షన్స్.. ఓటరు నమోదుకు షెడ్యూల్ విడుదల

image

AP: కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్నాయి. ఇందుకోసం ఓటరు నమోదుకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 30 నుంచి NOV 6 వరకు అవకాశం కల్పించారు. ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలో నివసించే వారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదుచేసుకోవచ్చు. ప్రొవిజినల్, ఆధార్, ఓటర్ ఐడీ సమర్పించాల్సి ఉంటుంది.

Similar News

News December 1, 2025

CSIR-IHBTలో ఉద్యోగాలు

image

CSIR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోస్పియర్ టెక్నాలజీ(IHBT) 9 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు DEC 29 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc( అగ్రికల్చర్/హార్టికల్చర్/ఫారెస్ట్రీ/ బయాలజీ/ కెమికల్ సైన్స్/ అనలైటికల్ కెమిస్ట్రీ/కెమికల్ ఇంజినీరింగ్/ బయో కెమికల్ ), టెన్త్+ITI/ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

News December 1, 2025

AP న్యూస్ రౌండప్

image

* విజయవాడ తూర్పు నియోజకవర్గం రామలింగేశ్వర నగర్‌లో రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన హోం మంత్రి అనిత
* తిరుపతి కేంద్రంగా రాయలసీమ జోన్‌ను టూరిజం, ఇండస్ట్రీస్‌తో అభివృద్ధి చేస్తామన్న మంత్రి అనగాని సత్యప్రసాద్
* పండగ సీజన్ వస్తోంది.. ప్రైవేటు ఆల‌యాల్లో రద్దీపై ప్ర‌త్యేక దృష్టి పెట్టండి: CS విజయానంద్
* వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసింది: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

News December 1, 2025

TG ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

image

TG: శిఖా గోయల్, CV ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర తదితర IPS ఆఫీసర్లను IAS క్యాడర్లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని హైకోర్టు CSకు నోటీసులిచ్చింది. GO 1342 ద్వారా ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడం చట్టవిరుద్ధమని శ్రీకాంత్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన జస్టిస్ సూరేపల్లి నంద DEC10 లోపు సమాధానం ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు.