News October 3, 2024

టీడీపీలోకి ఎమ్మెల్సీ పద్మశ్రీ!

image

AP: ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ తన పదవికి, YCPకి రాజీనామా చేసి నెలరోజులైంది. ఇప్పటికీ ఆమె రిజిగ్నేషన్‌ను మండలి ఛైర్మన్ ఆమోదించలేదు. ఆమె గవర్నర్ కోటా MLCగా ఉండటంతో త్వరలోనే ఆయనతో సమావేశమై ఇష్టపూర్వకంగానే రాజీనామా చేసినట్లు తెలపనున్నట్లు సమాచారం. ఆమోదముద్ర పడగానే CM చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు పూర్తయినట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు.

Similar News

News February 9, 2026

T20WCలో నేడు..

image

T20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ కోల్‌కతా, కొలంబో, అహ్మదాబాద్ వేదికగా 3 మ్యాచ్‌లు జరగనున్నాయి.
* ఉ.11 నుంచి.. స్కాట్లాండ్vsఇటలీ
* మ.3 నుంచి.. జింబాబ్వేvsఒమన్
* రా.7 నుంచి.. దక్షిణాఫ్రికాvsకెనడా
LIVE: స్టార్‌స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్

News February 9, 2026

కిరాణాషాపులకు దెబ్బ?

image

ఇప్పటివరకు మెట్రో సిటీలకే పరిమితమైన క్విక్ కామర్స్ రంగం టైర్ 3/4 నగరాలకు వచ్చేసింది. ఇండియాలోని 200 నగరాల్లో బ్లింకిట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాబోయే ఐదేళ్లలో భారీగా కిరాణా దుకాణాలు మూతపడే అవకాశం ఉందని వ్యాపార విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే 10 ని. డెలివరీ ప్రభావం కిరాణాషాపులపై అంతగా ఉండదని, మెట్రో సిటీల్లో ఇది చూశామని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీ COMMENT?

News February 9, 2026

US సైనిక మోహరింపులకు భయపడం: ఇరాన్

image

అమెరికాతో <<19053726>>చర్చల్లో<<>> యురేనియం శుద్ధి విషయంలో వెనక్కి తగ్గబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ విషయంలో తమను ఆదేశించే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. <<19009250>>సైనిక మోహరింపు<<>>లతో అమెరికా తమను భయపెట్టలేదని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ అన్నారు. ‘మాకు USపై పెద్దగా నమ్మకం లేదు. ఆ దేశంతో చర్చల గురించి మా వ్యూహాత్మక భాగస్వాములైన చైనా, రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని తెలిపారు.