News March 19, 2025

వైసీపీకి ఎమ్మెల్సీ రాజీనామా

image

AP: వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఇప్పటికే వైసీపీకి నలుగురు ఎమ్మెల్సీలు(పోతుల సునీత, కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ) రాజీనామా చేశారు. రాజశేఖర్ 2004లో చిలకలూరిపేటలో స్వతంత్ర MLA అభ్యర్థిగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ వైసీపీని స్థాపించాక ఆ పార్టీలో జాయిన్ అయ్యారు.

Similar News

News March 19, 2025

ఉస్మానియా.. గత వైభవం ఏది?

image

తెలంగాణకు గర్వకారణమైన ఉస్మానియా యూనివర్సిటీ సమస్యల వలయంలో చిక్కుకుంది. ఫుడ్ బాగుండట్లేదని, బొద్దింకలు, వెంట్రుకలు వస్తున్నాయని విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవల ఏకంగా బ్లేడ్ రావడం కలకలం రేపింది. ఉదయం నీళ్లు లేకపోవడంతో స్నానం చేయకుండానే క్లాసులకు వెళ్లాల్సి వస్తోందంటున్నారు. ఫ్యాకల్టీ సైతం రోజూ రావట్లేదని చెబుతున్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. COMMENT?

News March 19, 2025

రాష్ట్రంలో త్వరలో 25,190 ఉద్యోగాల భర్తీ: భట్టి

image

TG: త్వరలోనే 14,236 అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. రెవెన్యూ విభాగంలో 10,954 గ్రామస్థాయి పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగులకు నాలెడ్జ్ సెంటర్లలో గ్రూప్-1, గ్రూప్-2 ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఫలితాలు ప్రకటించిన పరీక్షలకు సంబంధించి త్వరలోనే నియామక పత్రాలు ఇస్తామన్నారు.

News March 19, 2025

అసెంబ్లీ ఎల్లుండికి వాయిదా

image

TG: అసెంబ్లీ ఎల్లుండికి వాయిదా పడింది. ఇరు సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి శుక్రవారం అసెంబ్లీ ప్రారంభం కానుంది.

error: Content is protected !!