News January 29, 2025

రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలివే

image

<<15299236>>తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.<<>> ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానాలకు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ ఉపాధ్యాయ స్థానానికి ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇక తెలంగాణలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ స్థానాలకు, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతాయి.

Similar News

News March 2, 2026

గల్ఫ్‌లో ఉన్నవాళ్లు భారత్ రావాలంటే?

image

యుద్ధ పరిస్థితులతో గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. INDకు తిరిగి రావాలనుకునేవారికి ఒకేఒక్క ఆప్షన్ ఉంది. అదే ఒమన్ మీదుగా IND చేరుకోవడం. ఆ దేశంపై ఇరాన్ దాడి చేయడం లేదు. దీంతో భారతీయులను రోడ్డు మార్గంలో ఒమన్‌కు తీసుకొచ్చి అక్కడి నుంచి స్వదేశానికి రప్పించేలా చర్చలు జరిపినట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. దుబాయ్ నుంచి ఒమన్ రాజధాని మస్కట్‌కు బైరోడ్ 450km ప్రయాణించాలి.

News March 2, 2026

ట్రంప్ నిర్ణయానికి US ప్రజల మద్దతుందా?

image

US-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై జరిపిన సైనిక దాడులను అమెరికా ప్రజలు స్వాగతించడం లేదని తెలుస్తోంది. ‘Reuters Ipsos’ సర్వే ప్రకారం కేవలం 25% మంది అమెరికన్లు మాత్రమే ఈ దాడులను సమర్థించారు. 43% మంది యుద్ధాన్ని వ్యతిరేకించగా 29% మంది అభిప్రాయం చెప్పలేదు. అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోతే ఈ మద్దతు మరింత తగ్గుతుందని సర్వే వెల్లడించింది. మధ్యంతర ఎన్నికల వేళ ఇది ట్రంప్ ప్రభుత్వానికి సవాల్‌గా మారొచ్చు.

News March 2, 2026

225 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ESI కార్పొరేషన్‌లో 225 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. UPSC నిర్వహించిన కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్- 2024కు సంబంధించి ప్రతిభా సేతు పోర్టల్ జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. పే స్కేల్ రూ.56,100-రూ.1,77,500 ఉంది. వెబ్‌సైట్: https://esic.gov.in