News March 4, 2025
MLC ఎన్నికలు.. అప్పుడు PRTU.. ఇప్పుడు BJP

టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య మొదటి ప్రాధాన్యం ఓట్లతో గెలుపొందారు. మొత్తం 27,088 ఓట్లకు గాను 25,041 ఓట్లు పోలు కాగా.. 24,144 చెల్లుబాటు అయ్యాయి. దీంతో గెలుపు కోటా ఓట్లు 12,073గా నిర్ధారించారు. మల్క కొమురయ్య 12,959, వంగ మహేందర్రెడ్డి 7,182, అశోక్కుమార్ 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. గతంలో PRTU బలపరిచిన రఘోత్తంరెడ్డి విజయం సాధించగా, ఈసారి బీజేపీ గెలిచింది.
Similar News
News March 4, 2025
ఏలూరు: ఎమ్మెల్సీగా గెలిచిన కూటమి అభ్యర్ధి పేరాబత్తుల

ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ విజయం సాధించారు. ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చేతుల మీదుగా ఆయన గెలుపు పత్రం అందుకున్నారు. రాజశేఖరం వెంట ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఉన్నారు. రాజశేఖరం గెలుపుతో కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.
News March 4, 2025
నల్గొండ: ఓటు హక్కు కలిగిన ఏకైక అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి

WGL, KMM, NLG టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో ప్రభుత్వ టీచర్గా చేసినవాళ్లు తక్కువ మంది. అయినప్పటికీ ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ఏకైక అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి మాత్రమే. ఆయన ఎన్నికలకు ముందు తన ఉపాధ్యాయ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఓటు మాత్రం ఆరు నెలల వరకు ఉంటుంది. నర్సిరెడ్డి, సర్వోత్తమ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి కూడా టీచర్గా పదవీ విరమణ చేశారు.
News March 4, 2025
మైక్రోచిప్, ఓలా, స్టార్బక్స్లో వేలాది ఉద్యోగాల కోత

మైక్రోచిప్, ఓలా, స్టార్బక్స్ సంస్థలు భారీగా ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించాయి. మైక్రోచిప్ 2వేలు, ఓలా ఎలక్ట్రిక్ 1000, స్టార్బక్స్ 1100, హెచ్పీ 2వేల ఉద్యోగాల్ని తొలగించనున్నాయి. ఖర్చు తగ్గింపులో భాగంగా కొలువుల్ని తగ్గిస్తున్నట్లు సంస్థలు వివరిస్తున్నాయి. ఈ ఏడాది జూన్లోపు లే ఆఫ్స్ పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ఉద్యోగుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.