News January 2, 2025

MLG: ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల గల్లంతు

image

<<15041941 >>ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు <<>>మిర్యాలగూడ మండలంలో గల్లంతయిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు..UPకి చెందిన కార్తీక్‌ మిశ్రా, విజయ్‌ గోస్వామి యాదాద్రి థర్మల్‌ ప్లాంట్లో బిల్డింగ్‌ ఇంజినీర్‌లుగా పనిచేస్తున్నారు. మిత్రులతో కలిసి వజీరాబాదు మేజర్‌ వద్ద సాగర్‌ ఎడమకాల్వలో నిన్న ఈతకు వెళ్లగా.. కాలు జారి కార్తీక్ నీటిలో పడిపోయాడు. కాపాడటానికి ప్రయత్నించిన విజయ్‌‌కు సైతం ఈత రాకపోవడంతో ఇద్దరు గల్లంతయ్యారు.

Similar News

News December 3, 2025

నల్గొండ: డీసీసీ ప్రెసిడెంట్‌గా నియామకపత్రం అందుకున్న పున్న కైలాశ్

image

నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్‌గా పున్న కైలాశ్ నేత నియామకం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేతుల మీదుగా మంగళవారం నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

News December 3, 2025

NLG: నేటి నుంచి మూడో విడత నామినేషన్లు

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. రెండో విడత MLG డివిజన్లో నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. మూడో విడత దేవరకొండ డివిజన్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 3న ఎన్నికల అధికారి విడుదల చేయనున్నారు. దేవరకొండ డివిజన్లోని 9 మండలాల్లో 269 గ్రామాలకు, 2,206 వార్డులకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

News December 2, 2025

నియామక పత్రం అందుకున్న పున్న కైలాష్ నేత

image

నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్‌ పున్న కైలాష్ నేత మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య, టీపీసీసీ జనరల్ సెక్రటరీలు చనగాని దయాకర్, దైద రవీందర్ పాల్గొన్నారు.