News January 2, 2025
MLG: ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల గల్లంతు

<<15041941 >>ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు <<>>మిర్యాలగూడ మండలంలో గల్లంతయిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు..UPకి చెందిన కార్తీక్ మిశ్రా, విజయ్ గోస్వామి యాదాద్రి థర్మల్ ప్లాంట్లో బిల్డింగ్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. మిత్రులతో కలిసి వజీరాబాదు మేజర్ వద్ద సాగర్ ఎడమకాల్వలో నిన్న ఈతకు వెళ్లగా.. కాలు జారి కార్తీక్ నీటిలో పడిపోయాడు. కాపాడటానికి ప్రయత్నించిన విజయ్కు సైతం ఈత రాకపోవడంతో ఇద్దరు గల్లంతయ్యారు.
Similar News
News October 16, 2025
NLG: దీపావళి ఆఫర్.. రూపాయికే సిమ్ కార్డ్

దీపావళి పండుగకు రూపాయికి బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ ఆఫర్ ప్రవేశపెట్టినట్లు ఆ సంస్థ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. దీపావళి ప్రత్యేక పథకం ద్వారా ఒక్క రూపాయి ప్రీపెయిడ్ సిమ్ కార్డుతో నెల రోజుల పాటు అన్ని నెట్వర్క్కు అపరిమిత కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆఫర్ కొత్తగా ప్రీపెయిడ్ సిమ్ తీసుకునే వారికి వర్తిస్తుందన్నారు.
News October 16, 2025
నల్గొండ: భారీగా తగ్గిన దరఖాస్తులు

గతేడాదితో పోల్చుకుంటే మద్యం టెండర్లకు దరఖాస్తులు భారీగా తగ్గే అవకాశముంది. నల్గొండ జిల్లాలో 154 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానిస్తూ గత నెల 26న ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటివరకు కేవలం 496 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంలో ఈ సంఖ్య 7,057గా ఉంది. దరఖాస్తు చేయడానికి రెండు రోజులే అవకాశం ఉంది. డిపాజిట్ ధర పెంచడం కూడా దరఖాస్తులు తగ్గడానికి కారణంగా తెలుస్తోంది.
News October 15, 2025
పరిశోధనలే సమాజానికి దిక్సూచి: ఎంజీయూ వీసీ

విద్యాలయాలలో జరిగే పరిశోధనలే సమాజానికి సరైన దిశానిర్దేశం చేస్తాయని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. 2028లో జరగనున్న మూడో విడత నాక్ మూల్యాంకనంపై ఐక్యూఏసీ ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పరిశోధనల నాణ్యత పెంచాలని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సూచించారు.