News January 2, 2025

MLG: ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల గల్లంతు

image

<<15041941 >>ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు <<>>మిర్యాలగూడ మండలంలో గల్లంతయిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు..UPకి చెందిన కార్తీక్‌ మిశ్రా, విజయ్‌ గోస్వామి యాదాద్రి థర్మల్‌ ప్లాంట్లో బిల్డింగ్‌ ఇంజినీర్‌లుగా పనిచేస్తున్నారు. మిత్రులతో కలిసి వజీరాబాదు మేజర్‌ వద్ద సాగర్‌ ఎడమకాల్వలో నిన్న ఈతకు వెళ్లగా.. కాలు జారి కార్తీక్ నీటిలో పడిపోయాడు. కాపాడటానికి ప్రయత్నించిన విజయ్‌‌కు సైతం ఈత రాకపోవడంతో ఇద్దరు గల్లంతయ్యారు.

Similar News

News November 25, 2025

NLG: రిజర్వేషన్లు.. కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విడుదల చేసిన జీవో 46 ద్వారా ఖరారు చేసిన గ్రామ పంచాయతీ రిజర్వేషన్లతో సీట్లు తారుమారై అలజడి రేపింది. గ్రామాల్లో ఉన్న జనాభా ధామాషా ప్రకారం రొటేషన్ పద్ధతిలో ఈ సారి తమకే రిజర్వేషన్ ఖరారవుతుందనే ఆశతో ఇంతకాలం నిరీక్షించిన నాయకులకు రిజర్వేషన్ల మార్పులతో ఇబ్బందికర వాతావరణం నెలకొంది. జిల్లాలో ఎన్నో రోజులుగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రిజర్వేషన్లు కొందరి జాతకాలను తారుమారు చేశాయి.

News November 25, 2025

జిల్లాకు 3.66 లక్షల ఇందిర మహిళా శక్తి చీరలు

image

నల్గొండ జిల్లాకు 3.66 లక్షల ఇందిర మహిళా శక్తి చీరలు వచ్చాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. డిప్యూటీ సీఎం విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల చీరలను పంపిణీ చేసినట్లు ఆమె వెల్లడించారు. చీరల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.

News November 25, 2025

NLG: ఈ మండలాల్లో ఎస్టీలకు జీరో స్థానాలు!

image

జిల్లాలో తాజాగా కేటాయించిన రిజర్వేషన్లలో 12 మండలాల్లో ఎస్టీ వర్గానికి ఒక్క సర్పంచ్ స్థానం కూడా రిజర్వు కాలేదు. NKP, తిప్పర్తి, KTP, NLG, చిట్యాల, NKL, SLG, కట్టంగూరు, వేములపల్లి, MNGD, గట్టుప్పల్, చండూరు మండలాల్లో ఒక్క సర్పంచ్ స్థానం కూడా దక్కలేదు. ఈ మండలాల్లో ఎస్టీల జనాభా అతి స్వల్పంగా ఉండడం, జనాభా ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకొని సీట్ల సంఖ్యను ఖరారు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది.