News January 2, 2025

MLG: ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల గల్లంతు

image

<<15041941 >>ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు <<>>మిర్యాలగూడ మండలంలో గల్లంతయిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు..UPకి చెందిన కార్తీక్‌ మిశ్రా, విజయ్‌ గోస్వామి యాదాద్రి థర్మల్‌ ప్లాంట్లో బిల్డింగ్‌ ఇంజినీర్‌లుగా పనిచేస్తున్నారు. మిత్రులతో కలిసి వజీరాబాదు మేజర్‌ వద్ద సాగర్‌ ఎడమకాల్వలో నిన్న ఈతకు వెళ్లగా.. కాలు జారి కార్తీక్ నీటిలో పడిపోయాడు. కాపాడటానికి ప్రయత్నించిన విజయ్‌‌కు సైతం ఈత రాకపోవడంతో ఇద్దరు గల్లంతయ్యారు.

Similar News

News January 15, 2025

NLG: ఆంగ్ల భాష నైపుణ్యాలు పెంపే లక్ష్యం

image

విద్యార్థుల్లో ఆంగ్ల భాష నైపుణ్యాలు పెంపే లక్ష్యంగా ఇంటర్ విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇంటర్ విద్యార్థులకు ఆంగ్ల ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జనవరి 31న, ఫిబ్రవరి 1న నిర్వహించనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, వృత్తి విద్యా కోర్సులు చదివేవారు తప్పనిసరిగా ఆంగ్ల ప్రయోగ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుందని DIEO దస్రూ నాయక్ తెలిపారు.

News January 15, 2025

చైనా మాంజాతో గుట్టలో దంపతులకు గాయాలు

image

చైనా మాంజా దారం తగిలి బైక్‌పై వెళ్తున్న దంపతులకు గాయాలైన ఘటన బుధవారం యాదగిరిగుట్ట మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా జరిగింది. స్థానికుల వివరాలిలా.. దంపతులు యాదాద్రీశుడి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో మున్సిపల్ ఆఫీసు ఎదురుగా చైనా మాంజా దారం తగలడంతో బైక్ నడుపుతున్న వ్యక్తికి గొంతు తెగింది. అతడి భార్య వాహనం పైనుంచి పడడంతో గాయాలయ్యాయి. వారిని స్థానికులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

News January 15, 2025

భువనగిరి: గాలిపటం ఎగరవేస్తూ వ్యక్తి మృతి

image

పండగపూట ఆనందంగా గడపాల్సిన కుటుంబంలో తీవ్ర విషాదంలో నెలకొంది. సరదాగా గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి భవనంపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన యాదాద్రి జిల్లా మూటకొండూర్ మండలం అమ్మనబోలులో మంగళవారం జరిగింది. జూపల్లి నరేందర్ పిట్టగొడ లేని భవనంపై గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తూ కింద పడ్డాడని స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన అతణ్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందాడని చెప్పారు.