News March 25, 2025
MMTS అత్యాచారయత్నం.. నిందితుడి గుర్తింపు

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన మహేశ్గా గుర్తించారు. జంగం మహేశ్ ఫొటోను బాధితురాలికి చూపించడంతో తనపై లైంగిక దాడికి యత్నించింది మహేశేనని యువతి గుర్తించింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Similar News
News March 28, 2025
ఖైరతాబాద్ : ఉదయం 8 నుంచి రాత్రి 11 వరకు డ్యూటీ

జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందికి ఈ నెల 31 వరకు దాదాపు విశ్రాంతి ఉండేలాగా కనిపించడంలేదు. ఆయా సర్కిల్ కార్యాలయాల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు విధులు నిర్వర్తిస్తారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆస్తి పన్ను వడ్డీపై ఇచ్చే 90% రాయితీని ఉపయోగించుకోవాలని గ్రేటర్ కమిషనర్ ఇలంబర్తి నగర ప్రజలకు సూచించారు.
News March 28, 2025
HYD: శాసనమండలి సభ్యులను సన్మానించిన సీఎం

శాసనమండలిలో పదవీ కాలం పూర్తి చేసుకున్న సభ్యులను ఘనంగా సత్కరించారు. శాసనమండలి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పదవీ కాలం పూర్తి చేసుకున్న తొమ్మిది మంది సభ్యులను సత్కరించారు. మార్చి 29వ తేదీతో వీరి పదవి కాలం ముగియనుంది. కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారితో పాటు పలువురు పాల్గొన్నారు.
News March 28, 2025
మెట్రో ఎండీ పదవి కాలం కొనగించే అవకాశం..!

నిన్న ప్రభుత్వం టెర్మినేట్ చేసిన వారిలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉన్నారు. 2016లో రిటైర్డ్ అయిన మెట్రో ఎండీ, ప్రస్తుతం మెట్రో ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మరొకసారి ఎక్స్టెన్షన్ ఇచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాల్లో చర్చ సాగుతోంది.