News July 28, 2024

MNCL: అనుమానాస్పదస్థితిలో మహిళ దుర్మరణం

image

మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది తీరంలో అనుమానాస్పదస్థితిలో ఒక మహిళ దుర్మరణం పాలైనట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. మృతురాలు గోదావరి నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో ముఖం గుర్తుపట్టకుండా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థానిక పాత మంచిర్యాలకు చెందిన ధరణి పద్మ అనే మహిళ ఈనెల 25 నుంచి కనిపించకుండా పోయింది. మృతురాలు పద్మ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Similar News

News October 29, 2025

ఆదిలాబద్: ‘జనన బరువు ఆధారంగా శిశు మరణాల విశ్లేషణ చేయాలి’

image

ఆదిలాబాద్ జిల్లాలో నవజాత శిశు మరణాలను తగ్గించే దిశగా పటిష్ఠ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆరోగ్య శాఖ, వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. బీబీనగర్ ఎయిమ్స్ ప్రొఫెసర్ త‌నిగై నాథన్ జిల్లాలో గత నెలలో నమోదైన శిశు మరణాల గణాంకాలు, జనన బరువు ప్రకారం విభజన, సంబంధిత గ్రామాలు, తల్లుల ఆరోగ్య వివరాలు, తీసుకున్న చర్యలు తదితర అంశాలను వివరించారు.

News October 28, 2025

ఆదిలాబాద్: పోగొట్టుకున్న బ్యాగ్‌ను బాధితురాలికి అప్పగించిన పోలీసులు

image

గ్రామానికి వెళ్లే క్రమంలో సునీత అనే మహిళ బంగారు, వెండి ఆభరణాలు ఉన్న బ్యాగును ఆటోలో మరిచిపోయింది. ఈ విషయంపై వెంటనే ఆదిలాబాద్ బస్టాండ్‌లోని పోలీస్ సబ్ కంట్రోల్‌లో ఫిర్యాదు చేయగా స్పందించిన ఏఆర్ ఎస్ఐ ఎల్.దినకర్, మహిళా కానిస్టేబుల్ అపర్ణ కలిసి బాధితురాలు సునీత, పిల్లలు తెలిపిన ఆధారాల ప్రకారం ఆటో కోసం వెతకారు. ఆటోడ్రైవర్ జావిద్ నిజాయతీ చాటుకుని తిరిగి తన బ్యాగ్‌ను బాధితురాలికి అందించారు.

News October 28, 2025

ఆదిలాబాద్: ‘ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి’

image

ANM, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో ప్రతి గర్భిణిని గుర్తించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తల్లుల పోషకాహారం లోపం, గర్భధారణ సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం, అనారోగ్య పరిస్థితుల్లో సమయానికి వైద్యసేవలు అందకపోవడం వంటి కారణాల వల్ల తక్కువ బరువుతో పుట్టిన శిశువుల సంఖ్య పెరుగుతోందన్నారు. వైద్య, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.