News February 26, 2025

MNCL: అప్పుల బాధతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

మంచిర్యాలలోని రాజీవ్‌నగర్‌లో రామటెంకి బాణేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని SI ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బాణేశ్‌కు 2022లో గుండెకు స్టంట్స్ వేశారు. రెండో భార్య పుష్ప వివాహేతర సంబంధం విషయంలో గొడవలు కావడంతో వెంకటేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదై జైలుకు వెళ్లొచ్చారు. ఈ క్రమంలో అప్పులుకావడంతో భార్య పనికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో ఉరేసుకున్నారు.

Similar News

News March 27, 2025

భర్త అక్రమ సంబంధాన్ని పట్టించిన భార్య (వీడియో) 

image

భర్త అక్రమ సంబంధాన్ని రెడ్ హ్యాండ్‌గా పోలీసులకు భార్య పట్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అలిపిరి PS పరిధిలోని అక్కారం పల్లి రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. తన భర్త వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడని భార్యే100 కాల్ చేసి పోలీసుల సహాయంతో ఇంటిలోకి ప్రవేశించింది. ఆ సమయంలో అక్కడే బాధితురాలి మామ కోడలిపై కర్రతో దాడి చేశాడు. అడ్డుకున్న పోలీసులపై ఆయన దురుసుగా ప్రవర్తించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

News March 27, 2025

శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ బంపరాఫర్?

image

ఈ నెల 29న గువాహటిలో బీసీసీఐ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తదితరులు భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు, సిబ్బంది నియామకం వంటి అంశాలపై చర్చిస్తారని టాక్. కాగా టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను తిరిగి సెంట్రల్ కాంట్రాక్టులోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.

News March 27, 2025

మందమర్రి: రెండు లారీలు ఢీ.. ఒకరికి గాయాలు

image

మందమర్రి సమీపంలోని సోమగూడెం హైవేపై తెల్లవారుజామున రెండు లారీలు ఒకటి వెనుక ఒకటి ఢీకొనగా వెనుక లారీ క్యాబిన్లో ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు గంటల నుంచి గాయపడ్డ వ్యక్తి బయటికి రావడానికి నానా యాతన పడుతున్నాడు. విషయం తెలుసుకున్న108 సిబ్బంది, పోలీస్ శాఖ, హైవే సిబ్బంది అక్కడి చేరుకొని క్షతగాడ్రుడిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

error: Content is protected !!