News February 1, 2025
MNCL: అభయారణ్యం నుంచి వెళ్లే వాహనాలకు FEES

చెన్నూరు డివిజన్ ప్రాణహిత కృష్ణ జింకల వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన ప్రాంతం గుండా వెళ్లే వాహనాలకు పర్యావరణ రుసుం వసూలుకు ప్రతిపాదించినట్లు జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్ తెలిపారు. వెంచపల్లి రక్షిత అటవీ ప్రాంతంలోని కంపార్ట్మెంట్ నంబర్ 329, కోటపల్లిలోని పారుపల్లి, చెన్నూర్లోని కిష్టంపేట బీట్ వై జంక్షన్ వద్ద 2 చెక్ పాయింట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించామన్నారు.
Similar News
News October 29, 2025
ఆ పోస్టులు ఖాళీగా లేవు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు

బిహార్లో ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీశ్ కుమారేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ‘బిహార్లో సీఎం పోస్టు, ఢిల్లీలో ప్రధాని సీటు ఖాళీగా లేవు. ఇక్కడ నితీశ్ ఉన్నారు. అక్కడ మోదీ ఉన్నారు. మీకు (ఆర్జేడీ, కాంగ్రెస్) ఛాన్స్ రాదు’ అని అన్నారు. జంగిల్ రాజ్ నుంచి బిహార్ను రక్షించుకునేందుకే ఈ ఎన్నికలని చెప్పారు. ఒక్క పొరపాటు జరిగినా రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్తుందని ప్రజలను హెచ్చరించారు.
News October 29, 2025
WGL: జిల్లాలో 1,554 మి.మీల వర్షపాతం

తుఫాన్ కారణంగా వరంగల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 1,554 మి.మీల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక జిల్లాలో అత్యధికంగా నెక్కొండ మండలంలో 192 మి.మీల, వర్ధన్నపేట-175, ఖిలా వరంగల్-161, పర్వతగిరి-148, సంగేమ్-146, రాయపర్తి-133, WGL-125, ఖానాపురం-119, గీసుగొండ 105 మి.మీ, మిగతా మండలాల్లో 100 లోపు నమోదైంది.
News October 29, 2025
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వరంగల్, హన్మకొండ నగరాల్లో రోడ్లు, కాలనీలు జలమయమై జనజీవనం స్తంభించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అత్యవసర సహాయార్థం జిల్లా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.


