News March 2, 2025
MNCL: ఇంటర్ పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్

జిల్లాలో ఈ నెల 5 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం మంచిర్యాల కలెక్టరేట్లో ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News November 18, 2025
డిజిటల్ అరెస్ట్ వ్యవస్థ లేదు: SP జానకి షర్మిల

చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థ లేదని SP జానకి షర్మిల అన్నారు. వీడియో కాల్, వాట్సాప్, ఫోన్ ద్వారా ఎవరైనా “మీరు కేసులో ఉన్నారు” “మీరు అరెస్టులో ఉన్నారు” అని బెదిరిస్తే ప్రజలు నమ్మవద్దన్నారు. వ్యక్తిగత, బ్యాంక్, OTP, UPI, ఆధార్, వివరాలు తెలపవద్దన్నారు. డబ్బులు అడిగితే వెంటనే కాల్ కట్ చేయాలని, సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కు లేదా https://www.cybercrime.gov ఫిర్యాదు చేయాలని సూచించారు.
News November 18, 2025
డిజిటల్ అరెస్ట్ వ్యవస్థ లేదు: SP జానకి షర్మిల

చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థ లేదని SP జానకి షర్మిల అన్నారు. వీడియో కాల్, వాట్సాప్, ఫోన్ ద్వారా ఎవరైనా “మీరు కేసులో ఉన్నారు” “మీరు అరెస్టులో ఉన్నారు” అని బెదిరిస్తే ప్రజలు నమ్మవద్దన్నారు. వ్యక్తిగత, బ్యాంక్, OTP, UPI, ఆధార్, వివరాలు తెలపవద్దన్నారు. డబ్బులు అడిగితే వెంటనే కాల్ కట్ చేయాలని, సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కు లేదా https://www.cybercrime.gov ఫిర్యాదు చేయాలని సూచించారు.
News November 18, 2025
BIG BREAKING: లొంగుబాటులో మావో చీఫ్

మావోయిస్టులకు సంబంధించి Way2Newsకు కీలక సమాచారం అందింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విజయవాడలో అరెస్టైన మావోయిస్టుల్లో 9 మంది దేవ్ జీ సెక్యూరిటీ అని AP ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా వెల్లడించారు. దీంతో తన గార్డులతో పాటు దేవ్ జీ లొంగిపోయి ఉంటారని తెలుస్తోంది. దీనిపై కొద్ది గంటల్లో అధికార వర్గాల నుంచి ప్రకటన రావచ్చు.


