News March 18, 2025
MNCL: ఈ నంబర్లకు కాల్ చేయండి..!

ఏప్రిల్ 6న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం లాజిస్టిక్ సేవ విభాగం ఆధ్వర్యంలో ఇంటి వద్దకే కళ్యాణ తలంబ్రాలు పంపిణీకి బుకింగ్ను సోమవారం మంచిర్యాల ఆర్టీసి డిపో మేనేజర్ జనార్దన్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కళ్యాణం జరిగిన తర్వాత ముత్యాల తలంబ్రాలను పంపిణీ చేస్తామని తెలిపారు. అవసరమైన వారు 7382841860, 9866771482, 9154298541 నంబర్లలో సంప్రదించాలన్నారు.
Similar News
News November 21, 2025
మహిళల్లో లంగ్ క్యాన్సర్ ముప్పు

మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఆందోళనకరంగా పెరిగిపోతుందని WHO ఆందోళన వ్యక్తం చేసింది. ఇండోర్, ఔట్డోర్ వాయుకాలుష్యం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం, చిన్న వయసులోనే మరణించే అవకాశం స్త్రీలలోనే అధికంగా ఉంది. బయో ఇంధనాలు, వంట నుంచి వచ్చే పొగకు ఎక్కువగా గురికావడం, చికిత్సను నిర్లక్ష్యం చేయడం వల్ల లంగ్ క్యాన్సర్ ముప్పు పెరిగిపోతోందని, మహిళలు వాయుకాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతోంది.
News November 21, 2025
నా ఆస్తులన్నీ పార్టీకి విరాళంగా ఇచ్చేస్తా: ప్రశాంత్ కిశోర్

జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఐదేళ్లలో తాను సంపాదించే డబ్బులో 90%, ఢిల్లీలో కుటుంబం కోసం ఇల్లు మినహా 20ఏళ్లలో సంపాదించిన ఆస్తులను పార్టీకే ఇచ్చేస్తానని తెలిపారు. ప్రజలు కూడా ఏటా రూ.వెయ్యి చొప్పున విరాళం ఇవ్వాలని కోరారు. ‘JAN 15 నుంచి బిహార్ నవ్నిర్మాణ్ సంకల్ప యాత్ర చేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం’ అని చెప్పారు.
News November 21, 2025
చిత్తూరు: పేదరికాన్ని జయించినా.. విధిని ఓడించలేక.!

అసలే పేదరికం.. మరోవైపు తల్లిలేని లోటు. అయినా ఆమె పట్టుదలతో ఉన్నత చదువులు చదివింది. ఓ వైపు నాన్నకు తోడుగా ఉంటూ, కుటుంబ బాధ్యతలు మోస్తూ <<18347620>>కష్టాల కడలి<<>>ని దాటి MLHP ఉద్యోగం సంపాదించింది ఆదిలక్ష్మి. పెళ్లి చేసుకుని ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ విధికి ఇది నచ్చలేదోమో. ఆమె బిడ్డ రూపంలో మరోసారి పరీక్షించింది. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకున్న ఆమె కూతురి విషయంలో కలత చెంది ఆత్మహత్య చేసుకుంది.


