News April 6, 2025

MNCL: ఈ నెల 7 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం

image

మంచిర్యాలలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్‌లో ఈ నెల 7 నుంచి 15 వరకు పదో తరగతి పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతుందని డీఈఓ యాదయ్య తెలిపారు. మూల్యాంకనం కోసం మొత్తం 770 మందిని నియమించామని, వారంతా ఈ నెల 7న రిపోర్టు చేయాలని సూచించారు. కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవని వెల్లడించారు.

Similar News

News October 19, 2025

జూరాలకు తగ్గిన వరద

image

ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది. కర్ణాటక ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను నిలిపివేయడంతో ఆదివారం సాయంత్రం జూరాలకు 28 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు అన్ని గేట్లను మూసివేశారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తికి, వివిధ కాలువల ద్వారా మొత్తం 32,362 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News October 19, 2025

NZB: పోలీసులకు సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ

image

విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ప్రమోద్‌పై దాడి చేసి చంపిన రియాజ్‌ను పోలీసులు ఆదివారం పట్టుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో పోలీసులకు మద్దతుగా అభినందనల వెల్లువెత్తాయి. ఈ ఘటన జరిగినప్పటి నుంచి సీపీ సాయి చైతన్య నాయకత్వంలో 9 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు ఆదివారం పోలీసులకు చిక్కాడు. నిందుతుడిని ఎన్ కౌంటర్ చేయాలని సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయపడుతున్నారు.

News October 19, 2025

దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి?

image

దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి, తన తేజస్సుతో అజ్ఞానమనే చీకటిని తరిమివేసి, భక్తులను అనుగ్రహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పండుగ రోజున దీపాలు పెట్టి అమ్మవారిని ఆహ్వానించాలనే ఆచారాన్ని మనం అనాదిగా పాటిస్తున్నాం. నేడు ఇలా దీపాలు వెలిగిస్తే అమ్మవారు మనపై అనుగ్రహం చూపి సంపదలు స్థిరంగా ఉండేలా చేస్తారని నమ్మకం. ఆర్థిక స్థితి మెరుగై, కుటుంబంలోని అడ్డంకులు తొలగిపోతాయని విశ్వసిస్తారు.