News February 23, 2025
MNCL: ఎన్నికలకు సింగరేణి కార్మికులు దూరమేనా..?

ఈనెల 27న జరిగే పట్టభద్రుల ఎన్నికలకు సింగరేణి కార్మికులకు యాజమాన్యం ఇప్పటి వరకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటించకలేదు. దీంతో ఓటు హక్కు వినియోగించుకోలేమని సింగరేణి పట్టభద్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ శాఖల ఉద్యోగులకు స్పెషల్ లీవ్లు ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ సింగరేణి కార్మికులకు స్పెషల్ లీవ్ ఆదేశాల రాలేదని పలువురు కార్మికులు Way2News దృష్టికి తీసుకువచ్చారు.
Similar News
News November 22, 2025
ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. టెన్త్ పాసై 18-25 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం నెలకు రూ.18,000-రూ.56,900. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 14. హైదరాబాద్ బ్యూరోలో 6, విజయవాడలో 3 ఖాళీలు ఉన్నాయి. అప్లై చేసేందుకు ఇక్కడ <
News November 22, 2025
అద్దం పగిలితే అపశకునమా?

ఇంట్లో ఉన్న అద్దం పగిలిపోతే దురదృష్టం ఏడేళ్ల పాటు పీడిస్తుందని అంటుంటారు. కానీ ఇదో అపోహ మాత్రమే. పూర్వం అద్దాలు ఖరీదుగా ఉండేవి. కేవలం కొందరే వాటిని కొనుగోలు చేయగలిగేవారు. అందుకే వీటిని జాగ్రత్తగా వాడాలని ఈ టాక్టిక్ను ఉపయోగించారు. ఇది ఆర్థిక నష్టాన్ని నివారించడానికి పూర్వీకులు వాడిన సామాజిక నియంత్రణ పద్ధతి మాత్రమే. దురదృష్టానికి, అద్దం పగలడానికి ఎలాంటి సంబంధం లేదని పండితులు చెబుతున్నారు.
News November 22, 2025
మంగేళ గ్రామంలో ఎస్సీలకు దక్కని రాజ్యాంగ ఫలం

ఎస్సీ జనాభా ఉన్న ఈ గ్రామంలో ఎస్సీ కులస్థులకు మాత్రం రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రాజకీయ రిజర్వేషన్ ఫలాలు దక్కడం లేదు. బీర్పూర్ (M) మంగేళ గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా 238గా ఉంది. ప్రస్తుతం సుమారు 350 వరకు ఉంది. అయితే, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సర్పంచ్ పదవికి ఎస్సీ రిజర్వేషన్ రాకపోవడంతో ఎస్సీ కులస్థులు వెనుకబడి పోతున్నారు. ఇప్పుడైనా ఎస్సీ రిజర్వేషన్ కేటాయించాలని కోరుతున్నారు.


