News April 8, 2025

MNCL: ‘ఎస్ఏ- 2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’

image

జిల్లాలో ఈ నెల 9 నుంచి 17 వరకు 1 నుంచి 9వ తరగతులకు ఎస్ఏ- 2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల డీఈవో యాదయ్య తెలిపారు. ఇప్పటికే 1 నుంచి 5 తరగతికి సంబంధించిన ప్రశ్నాపత్రాలను అన్నిపాఠశాలలకు పంపిణీ చేశామని, 6 నుంచి 9వ తరగతుల ప్రశ్నాపత్రాలు ఆయా మండల కేంద్రాలలో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Similar News

News December 21, 2025

BR అంబేడ్కర్ వర్సిటీలో 71 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

image

ఢిల్లీలోని డాక్టర్ <>BR<<>> అంబేడ్కర్ యూనివర్సిటీ 71 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 9 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని JAN 16వరకు పంపవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, PhD/M.Phil, NET, SLAT, SET, M.Ed, M.LSc ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ప్రజెంటేషన్/సెమినార్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://aud.delhi.gov.in

News December 21, 2025

514 పోస్టులు.. అప్లికేషన్ల స్వీకరణ మొదలు

image

బ్యాంక్ ఆఫ్ ఇండియా 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ల స్వీకరణ మొదలైంది. ఆన్‌లైన్‌లో 2026 జనవరి 5వ తేదీ వరకూ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస విద్యార్హత డిగ్రీ, పోస్టులను బట్టి వయస్సు: 25-40 పరిమితి ఉంది. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ప్రతిభ ఆధారంగా (70:30) ద్వారా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు BOI అధికారిక సైట్ చూడండి.

News December 21, 2025

HYD: బైక్ పార్క్ చేస్తున్నారా..? జర జాగ్రత్త సుమా!

image

HYDలో మీ బైక్ బయట పార్క్ చేస్తున్నారా..? జర జాగ్రత్త సుమా..! హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో 2025లో ఇప్పటికే 6,200 బైకుల చోరీ కేసులు నమోదయ్యాయి. బొడుప్పల్లో ఓ వ్యక్తి రాత్రి వేళల్లో బండిని ఇంటి బయట పార్క్ చేయగా, దొంగ తాళాలు ఉపయోగించి బండి ఎత్తుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. వాహన యజమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.