News January 31, 2025

MNCL: కరెంట్ సమస్యలా. 1912కి కాల్ చేయండి

image

ఎలాంటి విద్యుత్ సమస్య తలెత్తిన టోల్ ఫ్రీ నంబర్ 1912లో సంప్రదించాలని మంచిర్యాల సర్కిల్ ఎస్ఈ గంగాధర్ తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ల  ఫెయిల్యూర్లు, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, లోవోల్టేజీ, బ్రేక్ డౌన్స్, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు, తీగలు, విద్యుత్ మీటర్లు, బిల్లుల్లో సమస్యలపై 1912 నంబర్‌ను సంప్రదించి సేవలు పొందాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News November 26, 2025

తుఫాను ముప్పు తప్పింది.. అల్పపీడనం దూసుకొస్తోంది

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన సెన్యార్ తుఫాను ఇండోనేషియా వైపు పయనిస్తోంది. దీంతో రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పిందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపారు. ఇది క్రమంగా వాయుగుండంగా బలపడి ఈ నెల 29న తమిళనాడు వద్ద తీరం దాటుతుందని అంచనా వేశారు. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

News November 26, 2025

కదిరిలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

image

కదిరి టౌన్‌లోని రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ షెడ్ పక్కన చింతచెట్ల కింద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని స్థానికులు అంటున్నారు. అతని ఒంటిపై తెలుపు రంగు టీషర్టు, నలుపు రంగు ప్యాంటు ఉంది. మృతుడికి సుమారు 35 ఏళ్ల వయసు ఉంటుందని పేర్కొన్నారు. వివరాలు తెలిసినవారు 94407 96851కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కదిరి టౌన్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు.

News November 26, 2025

ఉమ్మడి ఖమ్మం నుంచే సీఎం పంచాయతీ ఎన్నికల శంఖారావం..!

image

సీఎం రేవంత్ రెడ్డి స్థానికసంస్థల ఎన్నికల శంఖారావాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే పూరించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబరు 2న కొత్తగూడెం పరిధి లక్ష్మిదేవిపల్లిలో ఎర్త్‌సైన్స్ యూనివర్సిటీ ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. భద్రాద్రి రామయ్య దీవెనలతో పంచాయతీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాలని సీఎం భావిస్తున్నారట. సీఎం సభకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.