News January 30, 2025

MNCL: కుంభమేళాకు స్పెషల్ రైళ్లు

image

యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా కోసం SCR 4 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి-దానాపూర్ మధ్య ఫిబ్రవరి 5, 7 తేదీల్లో దానాపూర్-చర్లపల్లి మధ్య 7,9 తేదీల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. తెలంగాణలో జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.

Similar News

News November 21, 2025

అప్పుడు ఎలా కొన్నారు..?: YV

image

నెయ్యి కిలో రూ.351కే నాసిరకం అంటున్న చంద్రబాబు గతంలో ఆయన హయాంలో రూ.276కి ఎలా కొనుగోలు చేశారని TTD మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అది నాసిరకం కాదా అని వైవీ ప్రశ్నించారు. కల్తీ అని అంటున్న నెయ్యిని లడ్డూలో వాడారో లేదో భక్తులకు చెప్పాలన్నారు. చిన్న అప్పన్న నిజంగా తప్పు చేసి ఉంటే ఆయనకు సహకరించిన టీటీడీ అధికారులను సైతం గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు.

News November 21, 2025

సిబ్బంది సమయపాలన పాటించాలి: గరిమా అగర్వాల్

image

సిబ్బంది అందరూ తప్పనిసరిగా సమయపాలన పాటించాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. చందుర్తిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(పీహెచ్‌సీ) ఆమె శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఫార్మసీ, ఇమ్యునైజేషన్ గది, ఇన్ పేషెంట్ గదులు, ఇతర గదులు, ఆసుపత్రి ఆవరణను పరిశీలించారు. ప్రసవాల సంఖ్యపై ఆరా తీశారు.

News November 21, 2025

మెదక్: డీఈవోగా విజయ బాధ్యతలు

image

మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారిగా ఏ.విజయ శుక్రవారం బాధ్యతలు చేయట్టారు. ఏడీగా పనిచేస్తున్న విజయకు పూర్తి బాధ్యతలు ఇస్తూ విద్యాశాఖ సంచాలకులు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. SCERT ప్రొఫెసర్ డి.రాధా కిషన్ ఇన్‌ఛార్జ్ డీఈఓ, డైట్ ప్రిన్సిపల్‌గా గత 22 నెలలుగా పనిచేసి ఈనెల 11 నుంచి సెలవుపై వెళ్లడంతో ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న విజయకు పూర్తి బాధ్యతలు ఇచ్చారు.