News March 16, 2025

MNCL: గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు

image

2025-26 విద్యాసంవత్సరానికి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 6వ తరగతి ప్రవేశానికి 31 ఆగస్టు 2025 నాటికి విద్యార్థులకు 12 ఏళ్లకు మించకూడదన్నారు. SC, ST విద్యార్థులకు రెండేళ్లు సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 31లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News November 15, 2025

అంతులేని ప్రేమకూ ముగింపు తప్పదు!

image

అవసరాలు.. అంతులేని ప్రేమకూ ముగింపునిస్తాయని తెలిపే ఘటన చైనాలో జరిగింది. 2017లో జాన్ అనే మహిళ లంగ్ క్యాన్సర్‌తో ఎంతోకాలం జీవించదని డాక్టర్లు తెలిపారు. భార్యను అమితంగా ప్రేమించే భర్త జున్మిన్ ఆమెను cryopreservation పద్ధతిలో సంరక్షించేందుకు ఓ సంస్థతో 30ఏళ్ల ఒప్పందం చేసుకున్నాడు. ఇలా చేసిన తొలి వ్యక్తిగా నిలిచాడు. అయితే ఇటీవల అనారోగ్యానికి గురైన అతను తోడులేకుండా ఉండలేనని రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు.

News November 15, 2025

అసలు క్రయోప్రిజర్వేషన్ అంటే ఏమిటి?

image

ప్రస్తుతం రోజుకో కొత్త ఆవిష్కరణ మానవ జీవనాన్ని సులభతరం చేస్తోంది. ఈ క్రమంలోనే క్రయోప్రిజర్వేషన్ అనే పద్ధతికి సైంటిస్టులు నాంది పలికారు. అంటే ఒక శవాన్ని ఖననం చేయకుండా -196°C దగ్గర ద్రవ నైట్రోజన్‌లో నిల్వచేస్తారు. ఫ్యూచర్‌లో చనిపోయిన వ్యక్తిని బతికించే టెక్నాలజీ వస్తే ఆ దేహాన్ని ఉపయోగించుకుంటారు. రక్తం గడ్డకట్టకుండా, కణాలకు నష్టం జరగకుండా ఆ బాడీని చల్లబరిచే ప్రక్రియలో రక్షక ద్రావణాలను వాడతారు.

News November 15, 2025

HYD: ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎప్పటి నుంచంటే!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌ ఎత్తివేతకు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 6న అధికారులు కోడ్‌ను అమల్లోకి తెచ్చారు. ఎన్నికల నామినేషన్ల నుంచి కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించారు. రేపటితో ఎన్నికల కోడ్ ముగియనుంది. ఇక సోమవారం నుంచి ప్రభుత్వ పథకాలు, ఇతర అభివృద్ధి పనులు మొదలుకానున్నాయి. 17వ తేదీ నుంచి GHMC ‘ప్రజావాణి’ పునరుద్ధరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.