News March 16, 2025

MNCL: గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు

image

2025-26 విద్యాసంవత్సరానికి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 6వ తరగతి ప్రవేశానికి 31 ఆగస్టు 2025 నాటికి విద్యార్థులకు 12 ఏళ్లకు మించకూడదన్నారు. SC, ST విద్యార్థులకు రెండేళ్లు సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 31లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News October 25, 2025

MBNR: FREE కోచింగ్.. ఫోన్ చేయండి

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని యువకులకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ Way2Newsతో తెలిపారు. CCTV కెమెరా ఇన్సాలేషన్ & సర్వీస్ కోర్సులో ఉచిత శిక్షణ, వసతి ఇస్తున్నామని, వయసు 19-45లోపు ఉండాలని, ఆసక్తి గలవారు.. SSC MEMO, రేషన్, ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, 3 ఫొటోలతో ఈనెల 30లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 98481 42489కు సంప్రదించాలన్నారు.

News October 25, 2025

తుఫాను టైమ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

AP: <<18098989>>తుఫాను<<>> సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను APSDMA వివరించింది.
*హెచ్చరికల కోసం SMSలు గమనించండి.
*అత్యవసర సామగ్రిని సిద్ధం చేసుకోండి.
*అధికారులు సూచించగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి.
*విలువైన వస్తువులను వాటర్ ప్రూఫ్ కంటైనర్లలో ఉంచండి.
*విద్యుత్ మెయిన్ స్విచ్, ఎలక్ట్రానిక్స్ ఆపేయండి.
*తలుపులు, కిటికీలు మూసే ఉంచండి.
*పశువులు, పెట్స్‌ను వదిలేయండి.

News October 25, 2025

రాయదుర్గం: ఇన్‌స్టాగ్రాం పిచ్చి.. మృత్యువుకు దారి తీసింది

image

BTP డ్యాం స్పిల్ వే గేటు వద్ద గల్లంతైన యువకుడి వివరాలు లభ్యమయ్యాయి. రాయదుర్గంలోని కలేగార్ వీధికి చెందిన ముగ్గురు యువకులు డ్యాం గేట్లు ఓపెన్ చేస్తుండటంతో ఇన్‌స్టాగ్రాం వీడియోల కోసం వెళ్లారు. అందులో ఇద్దరు నీటిలో ఈత కొడుతూ.. గల్లంతయ్యారు. వారిలో ఒకరు బయటకురాగా మరో యువకుడు మహమ్మద్ ఫైజ్ ఆచూకీ లభించలేదు. చివరకు మత్స్యకారులు మృతదేహాన్ని వెలికితీశారు. యువకుడి తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని విలపించారు.