News August 13, 2024
MNCL: గోదావరి నదిపై వంతెన నిర్మాణం ప్రారంభించాలని నిరసన

మంచిర్యాల- అంతర్గాం మధ్య గోదావరి నదిపై గతంలో ప్రతిపాదించిన స్థలంలో వెంటనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వర్ రావు గారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన స్వలాభం కోసం మరో ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు.
Similar News
News December 15, 2025
జైనథ్: ముచ్చటకు మూడోసారి సర్పంచ్గా గెలుపు

జైనథ్ మండలం కౌట గ్రామ సర్పంచ్గా బోయర్ శాలునా విజయ్ ఘన విజయం సాధించారు. గతంలో సైతం ఆమె సర్పంచ్గా పని చేశారు. ఇదిలా ఉంటే ఆమె భర్త బోయర్ విజయ్ సైతం సర్పంచ్ సేవలందించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఆమె ఈమారు సైతం విజయం సాధించడం విశేషం. ముచ్చటగా మూడోసారి వారు సర్పంచ్గా గెలపొందారు. గ్రామాభివృద్ధికి తాము చేస్తున్న కృషిని గుర్తించే ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చారని వారు హర్షం వ్యక్తం చేశారు.
News December 14, 2025
విజయోత్సవ ర్యాలీలు వద్దు: అదనపు ఎస్పీ

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని అదనపు ఎస్పీ కాజల్ సింగ్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్, 223 బీఎన్ఎస్ ఆక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అధికారుల అనుమతితో, నిర్దేశించిన రోజున మాత్రమే ర్యాలీలు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం బేల, జైనథ్, భీంపూర్, తాంకో, ఆదిలాబాద్(రూ), మావల మండలాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది.
News December 14, 2025
ఆదిలాబాద్ జిల్లాలో తొలి ఫలితం

సాత్నాల మండలంలోని సాంగ్వి (జి) గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఆత్రం నగేశ్ గెలుపొందారు. ప్రత్యర్థిపై 389 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సర్పంచ్ నగేశ్ను పలువురు అభినందించారు.


