News December 15, 2024

MNCL: గ్రూప్- 2 పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సీపీ

image

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్- 2 పరీక్షల నేపథ్యంలో మంచిర్యాలలోని పరీక్ష కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు, పరీక్ష అనంతరం ఎగ్జామ్స్ షీట్స్ స్ట్రాంగ్ రూమ్ తరలింపుపై పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 17, 2025

ADB: 140 మహారాష్ట్ర దేశీదారు బాటిల్స్ స్వాధీనం 

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడకు చెందిన దినేష్ వద్ద 140 దేశీదారు సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ సీఐ సి.హెచ్. కరుణాకర్ రావ్ తెలిపారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా దేశీదారు తీసుకొచ్చి ఆదిలాబాద్‌లో విక్రయించేందుకు ప్రయత్నించే క్రమంలో స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో దినేష్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడిపై కేసు నమోదు చేసి దేశీదారు బాటిల్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు.

News January 17, 2025

మందమర్రి: కారుణ్య నియామకాలతో 1806 కొలువులు

image

మందమర్రి ఏరియాలో నూతనంగా ఉద్యోగాలు పొందిన 8 మంది డిపెండెంట్లకు జీఎం దేవేందర్ గురువారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏరియాలో ఇప్పటివరకు కారుణ్య నియామకాల ద్వారా 1806 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. నూతన కార్మికులు క్రమం తప్పకుండా విధులకు హాజరై అధిక బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలని కోరారు. కష్టపడి పనిచేసి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.

News January 17, 2025

సర్వే పారదర్శకంగా నిర్వహించాలి: ADB కలెక్టర్

image

లబ్ధిదారుల ఎంపికకు నిర్వహించే సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం ఆదిలాబాద్‌‌లోని అనుకుంటలో సర్వేను ఆయన మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పై సర్వే నిర్వహిస్తున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలను సేకరించారు. కమిషనర్ సీవీఎన్ రాజు, తదితరులున్నారు.