News March 20, 2025
MNCL: చనిపోయినోళ్ల పేరు మీద లోన్లు.. రూ.కోటి ఘరానా మోసం

చోళ మండలం ఇన్వెస్ట్మెంట్&ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ హౌసింగ్ ఫైనాన్స్ మంచిర్యాల బ్రాంచ్లో ఘరానా మోసం జరిగినట్లు CI ప్రమోద్రావు తెలిపారు. చనిపోయిన ఆరుగురి పేర్ల మీద ఇద్దరు బ్యాంక్ అధికారులు లోన్స్ పంపిణీ చేశారు. రూ.1,39,90,000ల మోసానికి బ్రాంచ్ మేనేజర్ చల్ల ప్రవీణ్ రెడ్డి, కరీంనగర్లో పనిచేస్తున్న చిట్టేటి అశోక్ రెడ్డి పాల్పడ్డట్లు తేలింది. కేసులో భాగంగా ప్రవీణ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News December 9, 2025
మెదక్: సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా చుక్క రాములు

సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా చుక్క రాములు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మెదక్లో మూడు రోజులుగా జరిగిన రాష్ట్ర 5వ మహాసభల్లో ఈ మేరకు తీర్మానం చేశారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా పాలడుగు భాస్కర్, కోశాధికారిగా రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అనేక కార్మిక అంశాలపై తీర్మానాలు చేశారు. నూతన కార్యవర్గానికి మెదక్ జిల్లా కార్యదర్శి మల్లేశం అభినందనలు తెలిపారు.
News December 9, 2025
ఫ్యూచర్ సిటీతో 13 లక్షల ఉద్యోగాలు: శ్రీధర్ బాబు

TG: దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రపంచస్థాయి నగరంగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేయనున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ‘13,500 ఎకరాల్లో జీరో కార్బన్ సిటీగా దీన్ని రూపొందిస్తాం. ఇక్కడి సంస్థల ద్వారా 13L మందికి ఉద్యోగాలు వస్తాయి. 9 లక్షల జనాభాకు వీలుగా గృహ నిర్మాణం జరుగుతుంది. డేటా సెంటర్లకు 400 ఎకరాలిస్తాం’ అని వివరించారు. అద్భుత ఆర్కిటెక్చర్ అర్బన్ ఫారెస్టులు ఉంటాయన్నారు.
News December 9, 2025
నెల్లూరు: బలమైన కారణాలు కావాలా.. విలువలకు లేదా..!

నెల్లూరు జిల్లా అంటే లక్షలాదిమందికి ఎమోషన్. కానీ ఇది అవసరం లేదంట. బలమైన కారణం కావాలంట. కలువాయ, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతిలో కలిపే ఆలోచనలో వ్యతిరేకత మొదలైంది. ఈక్రమంలో వచ్చే అభ్యంతరాల్లో కండలేరు రిజర్వాయర్, జిల్లాకేంద్రంతో దూరం, చారిత్రక ఆధారాలు వంటి వాటితో పాటు బలమైన అంశాలు తెలియజేయాలని, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లందుకు ప్రాధాన్యం ఉంటుందనే వాదన అధికారుల నుంచి వినిపిస్తోంది.


