News March 20, 2025

MNCL: చనిపోయినోళ్ల పేరు మీద లోన్లు.. రూ.కోటి ఘరానా మోసం

image

చోళ మండలం ఇన్వె‌స్ట్‌మెంట్&ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ హౌసింగ్ ఫైనాన్స్ మంచిర్యాల బ్రాంచ్‌లో ఘరానా మోసం జరిగినట్లు CI ప్రమోద్‌రావు తెలిపారు. చనిపోయిన ఆరుగురి పేర్ల మీద ఇద్దరు బ్యాంక్ అధికారులు లోన్స్ పంపిణీ చేశారు. రూ.1,39,90,000ల మోసానికి బ్రాంచ్ మేనేజర్ చల్ల ప్రవీణ్ రెడ్డి, కరీంనగర్‌లో పనిచేస్తున్న చిట్టేటి అశోక్ రెడ్డి పాల్పడ్డట్లు తేలింది. కేసులో భాగంగా ప్రవీణ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News March 22, 2025

జిల్లాలో రక్తహీనత తగ్గింది: కేంద్ర బృందం

image

ర‌క్త‌హీన‌త‌ను నివారించేందుకు ప్ర‌వేశ‌పెట్టిన ప‌లు ప‌థ‌కాల‌ను క్షేత్ర‌స్థాయిలో స‌మ‌ర్థంగా అమ‌లు చేస్తున్న కార‌ణంగానే జిల్లాలో ర‌క్త‌హీన‌త త‌గ్గింద‌ని జిల్లాలో ప‌ర్య‌టించిన కేంద్ర ప్ర‌భుత్వ వైద్య‌ నిపుణుల‌ బృందం అభిప్రాయ‌ప‌డింది. కలెక్టర్ అంబేడ్క‌ర్‌ను కేంద్ర బృంద ప్రతినిధులు శుక్రవారం కలిశారు. జిల్లాలో క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించిన త‌ర్వాత గుర్తించిన అంశాల‌ను క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు.

News March 22, 2025

వాహన ధరలను పెంచనున్న మహీంద్రా

image

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా తమ కంపెనీ వాహన ధరలను 3శాతం పెంచనున్నట్లు తెలిపింది. ఇన్‌పుట్ ఖర్చులు కమోడిటీ ధరలు పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ ధరలు వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇప్పటికే మారుతి సుజుకీ ఇండియా, హ్యుందాయ్, టాటా, కియా ఇండియా, సంస్థలు వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.

News March 22, 2025

సినిమా నటులకు పాడు సంపాదన ఎందుకు? నారాయణ

image

సినిమా నటులకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల ద్వారా వచ్చే పాడు సంపాదన ఎందుకని సీపీఐ జనరల్ సెక్రటరీ నారాయణ ప్రశ్నించారు. సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపును తప్పుడు పనులకు దుర్వినియోగం చేయోద్దని హితవు పలికారు. గతంలో చిరంజీవి కోకాకోలా యాడ్ ఇచ్చేవారని అయితే రక్తదానం చేస్తూ రక్తాన్ని దెబ్బతీసే డ్రింక్‌లను ఎలా ప్రమోట్ చేస్తారని ప్రశ్నించానని తెలిపారు. ఆ తర్వాత అటువంటి చేయనని చిరంజీవి తనతో చెప్పారన్నారు.

error: Content is protected !!