News March 27, 2025
MNCL జిల్లాలో జోరుగా నకిలీ విత్తనాల దందా

జిల్లాలో నకిలీ విత్తనాల దందా జోరుగా కొనసాగుతోంది. ఎక్కడ తయారుచేస్తున్నారో.. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో తెలియదు. వాటిని రైతులకు అంటగట్టి మోసగిస్తున్నారు. . వారం వ్యవధిలో తాండూర్లో 247KGల విత్తనాలు సీజ్ చేసి 8మందిని అరెస్ట్ చేశారు. కాసిపేట మండలంలో 315కిలోల విత్తనాలు సీజ్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాగా మందమర్రి, కన్నెపల్లిలో వందల కేజీల్లో విత్తనాలు జప్తు చేయగా పలువురిని అరెస్ట్ చేశారు.
Similar News
News November 21, 2025
పిల్లల వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అవుతున్నారా?

వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల పిల్లలకు వ్యాధుల నుంచి రక్షణే కాక Herd Immunityని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బిడ్డ పుట్టినప్పటి నుంచి ఏఏ టీకాలు ఎప్పుడెప్పుడు ఇవ్వాలనే దానిపై ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. దీనివల్ల ప్రాణాంతక వ్యాధుల నివారణకు రోగ నిరోధక శక్తి పెంపు ,ఆసుపత్రి ఖర్చుల తగ్గింపు, ఆరోగ్యకరమైన భవిష్యత్తు లభిస్తాయి. కాబట్టి పిల్లల టీకాలను నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు.
News November 21, 2025
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: NZB కలెక్టర్

రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చా తప్పక పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని NZB కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి నోడల్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికలను సాఫీగా నిర్వహించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.
News November 21, 2025
బాపుఘాట్లో ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం

HYDలో ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటుకు చర్యలు ప్రారంభం అయ్యాయి. ఈసా, మూసీ నదుల సంగమం బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్లో గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం పట్నాలోని గాంధీ మైదానంలో 72 అడుగుల కాంస్య విగ్రహం దేశంలోనే ఎత్తైంది. దీనికంటే ఎత్తైన విగ్రహం ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


