News March 27, 2025
MNCL జిల్లాలో జోరుగా నకిలీ విత్తనాల దందా

జిల్లాలో నకిలీ విత్తనాల దందా జోరుగా కొనసాగుతోంది. ఎక్కడ తయారుచేస్తున్నారో.. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో తెలియదు. వాటిని రైతులకు అంటగట్టి మోసగిస్తున్నారు. . వారం వ్యవధిలో తాండూర్లో 247KGల విత్తనాలు సీజ్ చేసి 8మందిని అరెస్ట్ చేశారు. కాసిపేట మండలంలో 315కిలోల విత్తనాలు సీజ్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాగా మందమర్రి, కన్నెపల్లిలో వందల కేజీల్లో విత్తనాలు జప్తు చేయగా పలువురిని అరెస్ట్ చేశారు.
Similar News
News April 21, 2025
కృష్ణా: బాబోయ్ అడ్మిషన్లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

కృష్ణా జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్లో అయితే టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు.
News April 21, 2025
NTR: బాబోయ్ అడ్మిషన్లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

ఎన్టీఆర్ జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్లో అయితే టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు.
News April 21, 2025
రోహిత్ శర్మ అరుదైన రికార్డు

CSKతో జరిగిన మ్యాచ్లో రాణించిన రోహిత్ శర్మ(76*) అరుదైన రికార్డును సాధించారు. IPLలో అత్యధిక(20) POTMలు సాధించిన భారత ప్లేయర్గా నిలిచారు. ఓవరాల్గా ఈ జాబితాలో ABD(25), గేల్(22) తొలి రెండు స్థానాల్లో, కోహ్లీ(19) ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. అలాగే IPLలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ధవన్(6,769)ను వెనక్కు నెట్టి 6,786 పరుగులతో హిట్ మ్యాన్ రెండో స్థానానికి చేరారు. కోహ్లీ(8,326) టాప్లో ఉన్నారు.