News March 21, 2025

MNCL: జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలు: డీఈవో

image

మంచిర్యాల జిల్లాలో రేపటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను డీఈవో యాదయ్య సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు.

Similar News

News December 5, 2025

కరీంనగర్: ‘కడుపులు కోసేస్తున్నారు’

image

ఉమ్మడి KNRలోని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో డెలివరీ అంటేనే జనాలు జంకుతున్నారు. నార్మల్ డెలివరీలకు అవకాశమున్నా క్రిటికలంటూ సర్జరీలు చేస్తున్నారు. ప్యాకేజీల పేరుతో ఒక్కో డెలివరీకి రూ.60వేలు దోచుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది JAN- OCT వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీలు 356 జరగగా C సెక్షన్ సర్జరీలే 2,490 ఉన్నాయంటే దోపిడీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 83% సర్జరీ డెలివరీలే చేస్తున్నారు.

News December 5, 2025

ఏలూరులో అత్యాచారం చేసిన వ్యక్తి అరెస్ట్: DSP

image

ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిని అత్యాచారం చేసిన జగదీష్‌ను అరెస్టు చేశామని DSP శ్రావణ్ కుమార్ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. జగదీష్‌పై దాదాపు 10 కేసులు ఉన్నాయన్నారు. చోరీ కేసులో ఏలూరు కోర్టుకు హాజరయ్యారని ఈ నేపథ్యంలో పాత అక్రమ సంబంధం ఉన్న ఓ మహిళను కలవడానికి వెళ్లిన జగదీష్, భవాని ఘర్షణకు దిగారు. ఘర్షణ పెరగడంతో అక్కడ ఉన్న యువతిని జగదీష్ అత్యాచారం చేశారన్నారు.

News December 5, 2025

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం చేయొచ్చు: రాజస్థాన్ హైకోర్టు

image

చట్టబద్ధంగా పెళ్లి వయస్సు రాకున్నా పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే హక్కు ఇద్దరు మేజర్లకు ఉందని రాజస్థాన్ హైకోర్టు స్పష్టం చేసింది. live-inలో ఉన్న తమకు రక్షణ కల్పించాలని కోటాకు చెందిన యువతి(18), యువకుడు(19) కోర్టును ఆశ్రయించారు. వారు చట్టప్రకారం పెళ్లి చేసుకోలేనంత మాత్రాన ప్రాథమిక హక్కులను కోల్పోకూడదని జస్టిస్ అనూప్ తీర్పుచెప్పారు. చట్ట ప్రకారం పురుషుల పెళ్లి వయసు 21 కాగా, మహిళలకు 18 ఏళ్లు ఉండాలి.