News April 4, 2025
MNCL: డిగ్రీ విద్యార్థులకు GOOD NEWS

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును KU అధికారులు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా వీటితో పాటు 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు సైతం రాసేందుకు అవకాశం కల్పించినట్లు KU అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 1, 3, 5 పరీక్ష ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 11 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News November 10, 2025
కుక్కల నియంత్రణపై మేయర్ సమీక్ష

గ్రేటర్ వరంగల్ నగరంలోని జన సంచార ప్రాంతాల్లో వీధి కుక్కలు ఉండకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యాచరణ (యాక్షన్ ప్లాన్) సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో వీధి కుక్కల నియంత్రణపై ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్తో కలిసి పాల్గొని సమర్థవంతం గా నిర్వహించుటకు మేయర్ సూచనలు చేశారు.
News November 10, 2025
SDPT: రైతులకు కలెక్టర్లు అండగా ఉండాలి: మంత్రి

వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు జిల్లా కలెక్టర్లు అండగా ఉండాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో వసతుల కల్పనపై సోమవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావుతో కలసి ఆయా శాఖల ఉన్నత అధికారులతో కలిసి, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
News November 10, 2025
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ అనిల్ కుమార్తో కలిసి కలెక్టర్ ప్రజావాణిలో పాల్గొన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సమస్యలు, వినతులు, పరిష్కారం నిమిత్తం 84 మంది దరఖాస్తు చేసుకున్న ప్రజల సమస్యలను విని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


