News April 4, 2025
MNCL: డిగ్రీ విద్యార్థులకు GOOD NEWS

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును KU అధికారులు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా వీటితో పాటు 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు సైతం రాసేందుకు అవకాశం కల్పించినట్లు KU అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 1, 3, 5 పరీక్ష ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 11 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News October 8, 2025
TGSRTCలో జాబ్స్.. నేటి నుంచి దరఖాస్తులు

TGSRTCలో 1,743 ఉద్యోగాల భర్తీకి నేడు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇందులో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. డ్రైవర్ పోస్టులకు 22-35 ఏళ్లు, శ్రామిక్ ఉద్యోగాలకు 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. SC, ST, BC, EWS కేటగిరీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంది. పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసేందుకు <
News October 8, 2025
ఆదిలాబాద్: నామినేషన్లు వేయాల్సింది అక్కడే..!

ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఆయా మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాలలో, జడ్పీటీసీ సభ్యుల నామినేషన్ల స్వీకరణ మండల పరిషత్ కార్యాలయంలో స్వీకరించనున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తూ సమయపాలన పక్కాగా పాటించాలన్నారు. అభ్యర్థి సహా ముగ్గురిని మాత్రమే లోనికి అనుమతించాలని సూచించారు.
News October 8, 2025
తాడిపత్రి నుంచి ప్రపంచ స్థాయికి వినయ్.. ప్రశంసలు వెల్లువ

తాడిపత్రికి చెందిన వినయ్ ప్రపంచ మహిళా క్రికెట్ కప్ మ్యాచ్ స్కోరర్గా ఎంపికయ్యాడు. వినయ్ RDT తరుఫున అండర్-16, 19 విభాగంలో జిల్లా జట్టుకు ఆడటమే కాకుండా.. అంపైర్, స్కోరర్గా రాణిస్తున్న సమయంలో ప్రతిభ గుర్తించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో స్కోరర్గా ప్రస్తుతం సేవలందిస్తున్నాడు. ICC women Cricket World Cup-2025 మ్యాచ్లు వైజాగ్లో జరగనున్నాయి. ఇంగ్లాండ్ V/S న్యూజిలాండ్ జట్టు స్కోరర్గా చేయనున్నారు.