News April 4, 2025

MNCL: డిగ్రీ విద్యార్థులకు GOOD NEWS

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును KU అధికారులు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా వీటితో పాటు 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు సైతం రాసేందుకు అవకాశం కల్పించినట్లు KU అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 1, 3, 5 పరీక్ష ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 11 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News October 12, 2025

2027 వరల్డ్ కప్ ఆడాలని ఉంది: జడేజా

image

తనను ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై ముందే చర్చించారని టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ జడేజా పేర్కొన్నారు. ‘నా సెలక్షన్‌పై మేనేజ్మెంట్, కోచ్, కెప్టెన్, సెలక్టర్లు డెసిషన్ తీసుకున్నారు. కారణాలేంటో నాకు చెప్పారు. 2027 WCకంటే ముందు కొన్ని వన్డేలు ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడల్లా పర్ఫార్మ్ చేసి వరల్డ్ కప్ టీమ్‌లో ప్లేస్ సాధించే ప్రయత్నం చేస్తా. ప్రపంచ కప్ కలను నిజం చేసుకుంటాను’ అని తెలిపారు.

News October 12, 2025

కొత్తగూడ: వెంటనే స్పందించిన ఎస్సై

image

కొత్తగూడ మండలం ఎంచగూడెంలో ఇద్దరు చిన్నారులు బావిలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, చిన్నారుల ప్రమాద విషయం తెలుసుకొని స్థానిక SI రాజ్ కుమార్ వెంటనే స్పందించారు. ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చిన్నారులు బావిలో పడిపోయారని తెలుసుకొని వారి ఆచూకీ కోసం మానవత్వంతో స్పందించి వెను వెంటనే గ్రామస్థుల సహకారంతో మృత దేహలను బయటకు తీసుకువచ్చారు. దీంతో మండల ప్రజలు SIని అభినందిస్తున్నారు.

News October 12, 2025

జో బైడెన్‌కు రేడియేషన్ థెరపీ

image

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ 82 ఏళ్ల వయసులో ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆయనకు ప్రస్తుతం వైద్యులు రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ‘జో బైడెన్ అగ్రెసివ్ ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అది ఆయన ఎముకలకు పూర్తిగా పాకింది’ అని ఈ ఏడాది మే నెలలో అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.