News April 4, 2025

MNCL: డిగ్రీ విద్యార్థులకు GOOD NEWS

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును KU అధికారులు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా వీటితో పాటు 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు సైతం రాసేందుకు అవకాశం కల్పించినట్లు KU అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 1, 3, 5 పరీక్ష ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 11 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News October 12, 2025

తిరుమలలో రద్దీ.. దర్శనానికి 24 గంటలు

image

AP: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూలలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న 84,571 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీకి రూ.3.70 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

News October 12, 2025

కేవీపల్లి : ఈతకు వెళ్లి స్టూడెంట్ మృతి

image

ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసింది. మహానంది వ్యవసాయ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్న కేవీపల్లి విద్యార్థి జనార్దన్ నాయక్ సమీపంలోని పాలేరు వాగులో దిగి మృతిచెందినట్లు ప్రిన్సిపల్ జయలక్ష్మి తెలిపారు. జిల్లెల్లమంద సమీపంలోని పెద్ద తండాకు చెందిన విద్యార్థి శనివారం కళాశాలకు సెలవు కావడంతో పాలేరు వాగులో ఈత కొట్టేందుకు స్నేహితులతో కలిసి వెళ్లినట్లు ఆమె పేర్కొన్నారు.

News October 12, 2025

HYD: రెండు రోజులు నీటి సరఫరా బంద్

image

కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్-3 పంపింగ్‌కు సంబంధించి భారీ లీకేజీకి మరమ్మతులు చేయనున్న నేపథ్యంలో రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుందని జలమండలి అధికారులు తెలిపారు. కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, వనస్థలిపురం, ఉప్పల్, రాంపల్లి, బోడుప్పల్, సరూర్‌నగర్, బండ్లగూడ, ఉప్పల్, శంషాబాద్, నాగోల్ ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.