News April 4, 2025
MNCL: డిగ్రీ విద్యార్థులకు GOOD NEWS

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును KU అధికారులు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా వీటితో పాటు 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు సైతం రాసేందుకు అవకాశం కల్పించినట్లు KU అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 1, 3, 5 పరీక్ష ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 11 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News October 11, 2025
నేటి ముఖ్యాంశాలు

*2047నాటికి దేశంలో నంబర్ వన్గా AP: చంద్రబాబు
*13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చేందుకు AP క్యాబినెట్ ఆమోదం
*అమరావతికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు విడుదల
*TG: వెల్ఫేర్ సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ రిలీజ్
*BJP-RSS సమాజాన్ని విషపూరితం చేస్తున్నాయి: రాహుల్
*వెనెజులా MP మరియాకు నోబెల్ శాంతి బహుమతి
*నోబెల్ కమిటీపై వైట్ హౌజ్ విమర్శలు
*WIతో రెండో టెస్ట్ తొలి రోజు భారత్ స్కోర్ 318/2
News October 11, 2025
హనీమూన్ కూడా మీరే ప్లాన్ చేయండి: త్రిష

పెళ్లికాని హీరోయిన్లలో త్రిష కూడా ఒకరు. అందుకే ఎప్పుడూ ఆమె పెళ్లిపై వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా ఆమెకు చండీగఢ్కు చెందిన వ్యాపారవేత్తతో పెళ్లి సెట్ అయ్యిందనే వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై ఆమె కాస్త ఘాటుగానే స్పందించారు. ‘వేరే వాళ్లు నా జీవితాన్ని ప్లాన్ చేయడం నాకు నచ్చుతుంది. వాళ్లే హనీమూన్ కూడా ప్లాన్ చేస్తారని వెయిట్ చేస్తున్నా’ అని సెటైరికల్ స్టోరీని ఇన్స్టాలో పోస్ట్ చేశారు.
News October 11, 2025
4 గ్రేడ్లుగా పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ: పవన్

AP: పంచాయతీలు బలోపేతం అవుతున్నాయని Dy.CM పవన్ అన్నారు. గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థను రద్దు చేస్తూ క్యాబినెట్ భేటీలో నిర్ణయించినట్లు తెలిపారు. 7,244 క్లస్టర్ల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. నాలుగు గ్రేడ్లుగా పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ చేస్తున్నామన్నారు. గ్రామ కార్యదర్శి పేరు పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్పు చేసినట్లు వివరించారు.