News April 4, 2025
MNCL: డిగ్రీ విద్యార్థులకు GOOD NEWS

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును KU అధికారులు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా వీటితో పాటు 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు సైతం రాసేందుకు అవకాశం కల్పించినట్లు KU అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 1, 3, 5 పరీక్ష ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 11 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News October 9, 2025
ఆర్మీ DG EMEలో 69 పోస్టులు

ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్(DG EME) 69 పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతగల అభ్యర్థులు NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్, MTS, LDC, JTTI పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు JTTI పోస్టులకు 30, మిగతా పోస్టులకు 25ఏళ్లు. రాతపరీక్ష, స్కిల్, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://indianarmy.nic.in/
News October 9, 2025
దీపావళి కానుకగా అకౌంట్లలోకి రూ.7వేలు?

AP: అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు(రూ.5వేలు) ఈ నెలలోనే జమయ్యే అవకాశాలున్నాయి. దీపావళి సందర్భంగా PM కిసాన్ 21వ విడత (రూ.2వేలు) రిలీజ్ చేయాలని కేంద్రం భావిస్తోంది. దీంతో పాటు రాష్ట్ర సాయం(మొత్తం రూ.7వేలు) కూడా జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు Way2Newsకు తెలిపారు. ☛ రోజూ వ్యవసాయం, పాడి, ఇతర సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> కేటగిరీలోకి వెళ్లండి.
News October 9, 2025
MNCL: ‘మహిళలు, బాలికలు, విద్యార్థినుల భద్రతే షీటీం లక్ష్యం’

మహిళలు, బాలికలు, విద్యార్థినుల భద్రతే లక్ష్యంగా షీటీం పనిచేస్తున్నట్లు మగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. కమిషనరేట్లో రెండు షీటీం బృందాలు పనిచేస్తూ మహిళ భద్రత, రక్షణ చర్యలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థినులు, మహిళలు అత్యవసర పరిస్థితుల్లో మంచిర్యాల జోన్ షీటీం నంబర్ 8712659386 సంప్రదించాలన్నారు. డయల్ 100కు కాల్ చేసి తక్షణ సహాయం పొందాలన్నారు.