News March 23, 2025
MNCL: డివిజనల్ స్థాయి కమిటీ సమావేశం

మంచిర్యాల ఆర్డీవో కార్యాలయంలో శనివారం భూ సంబంధిత సమస్యల పరిష్కారానికై డివిజనల్ స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆర్డీవో గూడూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏసీపీలు ప్రకాశ్, వెంకటేశ్వర్, డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు పాల్గొన్నారు. ఆర్డీవో మాట్లాడుతూ.. ప్రతి మండలంలో భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులో సమస్యలు ఉన్న వాటిని డివిజన్ కమిటీకి పంపాలని ఆదేశించారు.
Similar News
News November 13, 2025
HYD: హోమియో ఆసుపత్రిలో ఆర్థరైటిస్, సోరియాసిస్కు వైద్యం!

రామంతాపూర్ హోమియో వైద్య కళాశాలలో హోమియో వైద్య సేవలు ఉచితంగా పొందవచ్చు. 1, 3, 4, 5 గదులలో ఆర్థరైటిస్, సోరియాసిస్, ఫంగస్ ఇన్ఫెక్షన్, స్పాండిలైటిస్ లాంటి సమస్యలకు పరిష్కారం చూపుతారు. అంతేకాక అల్సర్కు సైతం వైద్యం అందిస్తున్నారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్లు సూచించారు.
SHARE IT
News November 13, 2025
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుండగా.. ప్రస్తుతం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. బుధవారం 72,283 మంది స్వామి వారిని దర్శించుకోగా… 22,583 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 4.54 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.
News November 13, 2025
మరికాసేపట్లో పెద్ద ప్రకటన: లోకేశ్

AP: ఇవాళ ఉదయం 9 గంటలకు పెద్ద ప్రకటన చేయనున్నట్లు మంత్రి లోకేశ్ Xలో పోస్టు చేశారు. 2019 నుంచి కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఒక కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తుఫానులా తిరిగివస్తోందన్నారు. ఆ కంపెనీ ఏదో 9amకు వెల్లడిస్తానని పేర్కొన్నారు. దీంతో ఆ సంస్థ ఏంటని సర్వత్రా చర్చ జరుగుతోంది. మీరేం అనుకుంటున్నారు?


