News March 23, 2025

MNCL: డివిజనల్ స్థాయి కమిటీ సమావేశం

image

మంచిర్యాల ఆర్డీవో కార్యాలయంలో శనివారం భూ సంబంధిత సమస్యల పరిష్కారానికై డివిజనల్ స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆర్డీవో గూడూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏసీపీలు ప్రకాశ్, వెంకటేశ్వర్, డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు పాల్గొన్నారు. ఆర్డీవో మాట్లాడుతూ.. ప్రతి మండలంలో భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులో సమస్యలు ఉన్న వాటిని డివిజన్ కమిటీకి పంపాలని ఆదేశించారు.

Similar News

News December 15, 2025

విజయ్ హజారే ట్రోఫీ అందరూ ఆడాల్సిందే: BCCI

image

డిసెంబరు 24 నుంచి ప్రారంభంకానున్న విజయ్ హజారే ట్రోఫీలో జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ తప్పనిసరిగా పాల్గొనాలని BCCI స్పష్టం చేసింది. కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం కోహ్లీ, రోహిత్‌లకి మాత్రమే కాకుండా అందరికీ వర్తిస్తుందని తెలిపింది. దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. గాయాలతో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్‌కు మినహాయింపు ఉంది.

News December 15, 2025

పేరుపాలెంబీచ్‌లో న్యూఇయర్ వేడుకలు అభినందనీయం: డిప్యూటీ స్పీకర్

image

పేరుపాలెం బీచ్‌లో ఈనెల 31న సాగర తీరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించడం అభినందనీయమని డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అన్నారు. సోమవారం పెదఅమిరంలోని తన కార్యాలయంలో ఆయన సెలబ్రేషన్స్‌కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. పేరుపాలెం బీచ్‌ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతుందని, వినోదాత్మకమైన కార్యక్రమాలను నిర్వహించడం మంచిదని ఆయన పేర్కొన్నారు.

News December 15, 2025

154 సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి

image

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ 7 మండలాల్లో 138 సర్పంచ్, 1123 వార్డు మెంబర్లు ఈ ఎన్నికల్లో గెలిచారు. రెండవ విడతలో 16 మంది సర్పంచ్, 248 వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయ్యారు. అలాగే 154 పంచాయతీలకు ఉపసర్పంచ్ ఎన్నిక పూర్తయింది. 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.