News February 9, 2025

MNCL: త్వరలో వాహనాలకు ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు

image

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని మండలాల గ్రామాల వాహనాలకు త్వరలో ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని తాళ్లపేట రేంజ్ అధికారి సుష్మారావు తెలిపారు. స్థానిక వాహనాలకు చెక్పోస్టుల వద్ద ఎలాంటి రుసుము వసూలు చేయమన్నారు. 24 గంటలు వాహనదారులు రాకపోకలు సాధించుకోవచ్చని వెల్లడించారు. ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటుతో ఇక్కడి వాహనదారులకు ఇబ్బందులు తలుగుతాయని, దానిపై ఉన్నతాధికారులు పునరాలోచిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 13, 2025

సంగారెడ్డి జిల్లాలో మహిళ హత్య

image

ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఆమె వద్దనున్న బంగారు కమ్మలు ఎత్తుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం ఖాదిరాబాద్ గ్రామంలో జరిగింది. స్థానికులు, ASI..కథనం ప్రకారం గ్రామానికి చెందిన గౌరమ్మ (45)ను బుధవారం అర్ధరాత్రి ఎవరో హత్య చేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి SP పరితోష్ పంకజ్ చేరుకొని పరిశీలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామన్నారు.

News March 13, 2025

సంబేపల్లె: వారాధి హత్య కేసులో వీడిన మిస్టరీ

image

కాంట్రాక్ట్ పనుల కోసం వారాధిని హత్య చేసినట్లు విచారణలో తేలినట్లు రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్ తెలిపారు. వారాధిని మార్చి 2వ తేదీన సంబేపల్లె మండలం ముద్దినేనివాళ్ళపల్లి సమీపంలోని మల్లూరమ్మ గుడి వద్ద సిమెంట్ వద్ద కాపలా కాస్తుండగా బండరాయితో హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చిన్నికృష్ణ, యోగానంద రెడ్డిలను అరెస్ట్ చేసినట్లు సీఐ చెప్పారు.

News March 13, 2025

ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా గద్వాల జిల్లా మల్దకల్లో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో 39.6 డిగ్రీలు, వనపర్తి జిల్లా దగడలో 39.6 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా కొత్తపల్లిలో 39.3 డిగ్రీలు, జిల్లా జక్లేరులో 39.2 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

error: Content is protected !!