News March 6, 2025

MNCL: పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత

image

కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని BRS ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయన్నారు. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి హరికృష్ణ గెలవలేదని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.

Similar News

News December 3, 2025

మీ బ్రెయిన్ ఏ గేర్ వేసింది..?

image

మన మెదడు 9, 32, 66, 83 వయస్సుల్లో లెవల్ షిఫ్ట్ అవుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. 0-9yrs: పరిసరాలు తెలుసుకోవడం. 9-32: పరిపక్వత దిశగా ప్రయాణం, భావోద్వేగాలు, పనితీరు, ఆలోచన శక్తి పెరుగుతాయి. గ్రాఫ్ వేస్తే.. 32Yrs పీక్ పర్ఫార్మెన్స్. 32-66: సెటిల్డ్, లిమిటేషన్స్ మెంటాల్టి. ప్రిడిక్టబుల్ థాట్స్. 66-83: మతిమరుపు, అనారోగ్యం, రిజర్వ్డ్ అవుతారు. 83- కొన్ని పనులు, ఆలోచనలే చేయగలరు.

News December 3, 2025

సంగారెడ్డి: 191 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు

image

పంచాయతీ ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి హాజరుకాని 191 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య బుధవారం తెలిపారు. డిసెంబర్ 5న నిర్వహించే డివిజన్ స్థాయి శిక్షణ కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలని ఆమె సూచించారు. లేకుంటే, ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

News December 3, 2025

పార్వతీపురం: సీఎం గారూ.. ఆశలన్నీ మీపైనే!

image

భామిని మండలంలో ఈ నెల 5న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కార చర్యలపై కదలిక వస్తుందా? అని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా జిల్లాలో వేధిస్తున్న ఏనుగుల సమస్య, వసతి గృహాల్లో విద్యార్థుల మరణాలు, విద్యా, వైద్య సిబ్బంది నియామకాలు, గిరిజనుల అభ్యున్నతిపై సీఎం హామీలు, నిధుల కేటాయింపుపై ప్రకటన చేస్తారేమోనని ప్రజలు వేచి చూస్తున్నారు.